AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TDP: కర్నూలు జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు.. బహిరంగసభ ఎప్పుడంటే..

TDP: కర్నూలు జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు.. బహిరంగసభ ఎప్పుడంటే..

J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Mar 27, 2024 | 9:49 PM

Share

ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు మార్చి 31న టీడీపీ అధినేత నారా చద్రబాబునాయుడు రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు చేపట్టిన ప్రజాగళం యాత్ర ఎమ్మిగనూరులో జరగనుంది. అందులో భాగంగా హెలిపాడ్ దగ్గర నుండి రోడ్ షో చేపట్టే అన్నమయ్య సర్కిల్, శివ సర్కిల్, సోమప్ప సర్కిల్ వరకు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు లోకల్ లీడర్లు.

ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు మార్చి 31న టీడీపీ అధినేత నారా చద్రబాబునాయుడు రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు చేపట్టిన ప్రజాగళం యాత్ర ఎమ్మిగనూరులో జరగనుంది. అందులో భాగంగా హెలిపాడ్ దగ్గర నుండి రోడ్ షో చేపట్టే అన్నమయ్య సర్కిల్, శివ సర్కిల్, సోమప్ప సర్కిల్ వరకు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు లోకల్ లీడర్లు. రోడ్ షో తరువాత తెరుబజారుకు చంద్రబాబు చేరుకొని అక్కడ ఏర్పటు చేసిన బహిరంగసభలో చంద్రబాబు మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి రూట్ మ్యాప్‎ను నేడు కర్నూలు ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజు, టిడిపి మాజీ ఎమ్మెల్యే బీవీ జయనగేశ్వర్ రెడ్డి పరిశీలించారు. చంద్రబాబు కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..