Lok Sabha Election 2024: తమిళనాడులో ఓటు వేసిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
తమిళనాడులో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. తొలివిడతలో ఒకేసారి 39లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే కోయంబత్తూరులో ఇషా ఫౌండేషన్ అధినేత, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన చేతికి ఉన్న ఓటు సిరా గుర్తును చూపిస్తూ ఎక్స్ ఖాతాలో ఫోటోలను షేర్ చేశారు.
తమిళనాడులో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. తొలివిడతలో ఒకేసారి 39లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే కోయంబత్తూరులో ఇషా ఫౌండేషన్ అధినేత, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన చేతికి ఉన్న ఓటు సిరా గుర్తును చూపిస్తూ ఎక్స్ ఖాతాలో ఫోటోలను షేర్ చేశారు. ప్రతి ఒక్కరు ఈ పౌర హక్కును వినియోగించుకోవాలని సందేశాన్ని ఇస్తున్నట్లు ఉంది ఈ ఫోటో. ఇప్పటికే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 12.55% ఓటింగ్ నమోదైనట్లు తెలిపారు అధికారులు. కళ్లకురిచ్చి నియోజకవర్గంలో మాత్రం 15% పైగా ఓటింగ్ నమోదు అయింది. సద్గురు తోపాటు పలువురు రాజకీయ నాయకులు కనిమొళి, గణపతి పి రాజ్కుమార్, ఏఐఏడీఎంకే నుంచి సింగై రామచంద్రన్, సీపీఐ(ఎం) నుంచి పీఆర్ నటరాజన్ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సినీ నటుడు కమల్ హాసన్ చెన్నైలోని కోయంబేడులో ఓటు వేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
పునర్వికకు క్రౌడ్ ఫండింగ్ ద్వారా పునర్జన్మ
గురుకులంలో క్షుద్రపూజలు.. రోడ్డెక్కిన విద్యార్థినులు..
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. తెల్లారే సరికి పోలీస్ స్టేషన్ లో
ఏజెన్సీలో చీకటి వైద్యం.. సెల్ఫోన్ వెలుగుల్లో ప్రజల ప్రాణాలు
ముస్లిం సోదరుల కోసం హిందూ కుటుంబం ఉదారత
దారుణం.. 2 నెలల పసికందును పొయ్యిలో పడేసి..
కత్తితో కారు దిగిన మహిళ.. కారు పైకి కోడిగుడ్లు విసిరిన దుండగులు

