Bharat Jodo Yatra: పున:ప్రారంభంమైన భారత్ జోడో యాత్ర.. ముక్తల్ నుండి అడుగేసిన రాహుల్ గాంధీ..(లైవ్)

|

Oct 27, 2022 | 8:31 AM

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో గురువారం పున:ప్రారంభమైంది. మూడు రోజుల విరామం అనంతరం రాహుల్ తెలంగాణలో రెండో రోజు పాదయాత్రను కొనసాగిస్తున్నారు. మక్తల్ శివారులోని సబ్ స్టేషన్ నుంచి భారత్ జోడో పాదయాత్రను..


ఇవాళ రాహుల్ పాదయాత్ర మక్తల్.. కన్యకాపరమేశ్వరి దేవాలయం, పెద్ద చెరువు ట్యాంక్‌బండ్‌, దండు క్రాస్‌ రోడ్డుల మీదుగా కచ్వర్‌ గ్రామానికి చేరుకుంటుంది. మధ్యాహ్న భోజనం అనంతరం జక్లేర్‌ క్రాస్‌ రోడ్డు మీదుగా గుడిగండ్ల గ్రామానికి చేరుకుంటారు. అక్కడ జరిగే సభలో ప్రసంగిస్తారు. అనంతరం ఎలిగండ్ల వద్దకు చేరుకుని రాత్రి బస చేయనున్నారు.కాగా, రాహుల్ పాదయాత్ర కోసం.. తెలంగాణ పీసీసీ భారీ ఏర్పాట్లు చేసింది. పాదయాత్రలో రాహుల్‌గాంధీ పలు ప్రజా సంఘాల ప్రతినిధులను, కార్మికులు, నారాయణపేట జిల్లాకు చెందిన బీడీ కార్మికులతో రాహుల్‌గాంధీ ముచ్చటిస్తూ పాదయాత్రను కొనసాగించనున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Army Dog: ఆర్మీ డాగా మజాకా..! రెండు బుల్లెట్లు దిగినా వెనుకడుగు వేయని ఆర్మీ డాగ్.. ఇద్దరు ముష్కరులు హతం.

woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో

Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.

Published on: Oct 27, 2022 08:27 AM