Manmohan Singh funeral: నిగమ్‌బోధ్ ఘాట్‌లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు

Updated on: Dec 28, 2024 | 11:48 AM

ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. సైనిక లాంఛనాలతో మన్మోహన్ అంత్యక్రియలు జరిపారు. నిగంబోధ్‌ ఘాట్‌లో మన్మోహన్ భౌతికకాయానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని నివాళులర్పించారు. అశ్రునయనాల మధ్య సంస్కరణల యోధుడికి తుది వీడ్కోలు పలికారు అభిమానులు. నిగమ్‌బోధ్ ఘాట్‌కు మన్మోహన్ అభిమానులు కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చి నివాళులర్పించారు.

అంతకుముందు ఏఐసీసీ ఆఫీస్‌లో మన్మోహన్‌కు ప్రజలు, కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. ఏఐసీసీ ఆఫీస్ నుంచి నిగమ్‌బోధ్‌ ఘాట్‌ వరకు మన్మోహన్‌ అంతిమయాత్ర కొనసాగించింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలు మన్మోహన్ సింగ్‌కు ఘననివాళులర్పించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క, ఎంపీ మల్లురవి మన్మోహన్‌కు అంజలి ఘటించారు. ఏపీ కాంగ్రెస్ నేతలు పల్లంరాజు, కేవీపీ రామచంద్రరావు మన్మోహన్‌ భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ ఒక్క కారణంతో.. 2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసిన సాయి పల్లవి

Vishnu Priya: అందుకే.. పృథ్వీతో చనువుగా ఉన్నా..

ఇప్పుడు ఈ స్టార్ హీరోలకు.. ఏపీ ప్రభుత్వమే దిక్కా

Sonu Sood: CM చేస్తానంటూ ఓ పార్టీ ఆఫరిచ్చింది.. ఒక్క మాటతో షాకిచ్చిన సోనూ సూద్‌

TOP 9 ET News: దూసుకుపోతున్న పుష్ప2.. ఏకంగా బాహుబలి రికార్డ్‌ గల్లంతయ్యే ఛాన్స్‌