KTR: RTCని ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతోంది
ఆర్టీసీ చార్జీల పెంపుపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలకు ఉచిత బస్సు పథకం పేరుతో పురుషులు, విద్యార్థుల నుంచి రెండింతలు వసూలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతోందని కేటీఆర్ విమర్శించారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతోందని అనుమానం వ్యక్తం చేస్తూ, చార్జీలు తగ్గించే వరకు బీఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు.
ఆర్టీసీ చార్జీల పెంపుపై బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుపై తీవ్ర విమర్శలు చేశారు. ఇంట్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి, పురుషులు, విద్యార్థుల నుంచి మాత్రం రెండింతలు వసూలు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. దీని వల్ల ఒక్కో కుటుంబానికి నెలకు ఇరవై రూపాయల నష్టం వాటిల్లుతోందని, ఈ విషయం తెలంగాణలోని ప్రతి కుటుంబానికి అర్థమైందని ఆయన పేర్కొన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జాతర వైబ్ కంటిన్యూ.. సెప్టెంబర్ విజయ పరంపర కొనసాగిస్తున్న చిత్రాలు
థియేటర్లోకి పంజుర్లి.. షాకైన ఆడియన్స్
2027 ప్రపంచకప్ నుంచి రోహిత్, కోహ్లీ ఔట్
Published on: Oct 07, 2025 05:28 PM
Loading...
Unable to load recommendations.
Follow Us
