తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణంగా లాక్డౌన్ ఎత్తివేశారు. దీంతో హైదారాబాద్ నగరంలో ప్రజా రవాణ వ్యవస్థ షురూ చేసేందుకు అధికారులు పరుగులు పెట్టిస్తున్నారు. ఇదే క్రమంలో మెట్రో రైలు సర్వీసుల్లో అధికారులు మార్పులు చేశారు. మెట్రో రైలు సేవలను అధికారులు పూర్తి స్ధాయిలో అందుబాటులోకి వచ్చాయి. నగరంలో మెట్రో రైలు సర్వీసుల్లో అధికారులు మార్పులు చేశారు. నేటి ఉదయం 7గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సర్వీసులు నడపనున్నట్లు తెలిపారు.మెట్రో సమయాల్లో మార్పులతో నిత్యం లక్ష మంది ప్రయాణికులు రాకపోకలు సాగించవచ్చని మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు. లాక్డౌన్లో సమయంలో సమయం కుదించినప్పటికీ ప్రతిరోజు పది వేలమంది ప్రయాణం చేశారు. గత ఏడాది లాక్డౌన్కి ముందు 4.5లక్షల మంది మెట్రో ప్రయాణం చేసినట్లు అధికారులు వెల్లడించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Arjun Kapoor Viral Video : కరీనా కపూర్ పార్టీలో గర్ల్ఫ్రెండ్ తో అర్జున్ కపూర్..! వైరలవుతోన్న వీడియో.