మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు.. ఇవాళ సుప్రీంకోర్టులో కీలక విచారణ.. ఏం జరగనుంది..

Edited By:

Updated on: Oct 04, 2023 | 7:40 PM

తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపిన ఓటుకు నోటు కేసుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ సంజయ్‌, జస్టిస్ సుందరేష్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఓటుకు నోటు వ్యవహారంపై 2017లో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 2 పిటిషన్లు వేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని

తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపిన ఓటుకు నోటు కేసుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ సంజయ్‌, జస్టిస్ సుందరేష్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఓటుకు నోటు వ్యవహారంపై 2017లో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 2 పిటిషన్లు వేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని ఆర్కే పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ నుంచి ఏసీబీ కేసును సీబీఐకి బదిలీ చేయాలని మరో పిటిషన్ దాఖలైంది. వీటన్నింటిపై సర్వోన్నత న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టనుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Oct 04, 2023 09:16 AM
Follow Us