ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు భీమవరంకు చెందిన శివ కుమారి అనే మహిళ తన కుమార్తె కనిపించడం లేదని పిర్యాదు చేసారు. దీంతో యువతి మిస్సింగ్ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న పవన్ కల్యాణ్ మాచవరం పోలిసు స్టేషన్ సీఐకి స్వయంగా ఫోన్ చేసారు. బాధిత మహిళను తన సొంత వాహనంలో స్టేషన్ కి పంపించి వివరాల్ని సీఐకు ఇవ్వాలని సూచించారు పవన్. మాచవరం పోలిసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తనకు పోలీసులు న్యాయం చేయలేదనీ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు తల్లి శివ కుమారి. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో మాచవరం పోలిసు స్టేషన్ కి వెళ్లి సీఐకు పిర్యాదు చేసారు శివ కుమారి. అప్రమత్తమైన పోలీసులు యువతి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.