కొత్త ట్విస్ట్.. అది పెట్రోల్ బాంబ్ కాదు.. నీళ్ల బాటిలట
వైసీపీ నేత జోగి రమేష్ ఇంటిపై దాడి ఘటన ఇబ్రహీంపట్నంలో కలకలం రేపింది. తన ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి జరిగిందని జోగి రమేష్ ఆరోపించగా, అది నీళ్ల బాటిల్ దాడి అని, సింపతీ కోసం జోగి రమేష్ వేసిన ప్లాన్ అని టీడీపీ నేతలు ఖండించారు. పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు నిజానిజాలు తేల్చేందుకు దర్యాప్తు ప్రారంభించాయి.
వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై జరిగిన దాడితో ఇబ్రహీంపట్నంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. తనను, తన కుటుంబాన్ని హత్య చేసేందుకు పెట్రోల్ బాంబులతో దాడి చేశారని జోగి రమేష్ ఆరోపిస్తున్నారు. దీని వెనుక చంద్రబాబు, లోకేష్ హస్తం ఉందని, ప్లాన్ ప్రకారమే ఈ దాడి జరిగిందని ఆయన పేర్కొన్నారు. దాడికి సంబంధించిన సీసీ ఫుటేజీని కూడా ఆయన చూపించారు. అయితే, జోగి రమేష్ ఆరోపణలను టీడీపీ వర్గం తీవ్రంగా ఖండించింది. ఇబ్రహీంపట్నం టీడీపీ నేత మహమ్మద్ ఫతావుల్లా మాట్లాడుతూ, అవి పెట్రోల్ బాంబులు కాదని, నీళ్ల బాటిళ్లు, కూల్ డ్రింక్ బాటిళ్లు అని తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Silver Price Fall: అయ్యో వెండి ఎంత పని చేసావే..
Pawan Kalyan: పార్టీ నేతలపై పవన్ అసంతృప్తి.. కారణం ఏంటి
MLA Arava Sridhar: నేడు రైల్వేకోడూరుకు జనసేన విచారణ కమిటీ
