పారిజాతం మొక్క లాభాలు తెలిస్తే షాకవ్వాల్సిందే
పారిజాతం ఆకులు, పూలను ఆయుర్వేదంలో అద్భుత ఔషధంగా పరిగణిస్తారు. అందుకే ఎన్నో ఏళ్లుగా ఆయుర్వేదంలో పలు రకాల అనారోగ్య సమస్యలకు మందుగా వాడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. అంతకుమించి వాటి వల్ల ఉండే ప్రయోజనాలు ఏంటో మనకు తెలియదు. అయితే వాటిని ఆహారంలో ఉపయోగించడం వల్ల చాలా లాభాలు ఉంటాయి.
అవి ఏంటో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు. ఆయుర్వేదంలో ఈ చెట్టు బెరడు, కొమ్మలు, ఆకులు, పువ్వులను కూడా ఔషధంగా వినియోగిస్తారు. పారిజాత చెట్టు బెరడును తీసి నీటిలో వేసి మరిగించి కషాయంలా తాగడం వల్ల ఎలాంటి జ్వరమైనా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అర్థరైటిస్, కీళ్ల నొప్పులు తగ్గడానికి పారిజాత పూల టీ లేదా ఆకుల టీ చాలా బాగా పనిచేస్తుంది. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉండడం వల్ల ఇది వాపులను సమర్థవంతంగా తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. పారిజాత పూల టీని క్రమం తప్పకుండా రోజూ తాగుతూ ఉండడం వల్ల స్త్రీ సంబంధమైన అనేక అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి ఈ టీ మంచి ఔషధం. పారిజాతం ఆకులను తేనె, అల్లం తో కలిపి రోజుకు రెండుసార్లు తీసుకుంటే కాలేయ సమస్యల నుంచి బయటపడవచ్చు. పారిజాతం పూలు గుండె సమస్యలను కూడా పోగొడుతుంది. పొడి దగ్గుతో బాధపడేవారు పారిజాతం ఆకులలో తేనె కలిపి తీసుకుంటే దగ్గు సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

