పిగ్మెంటేషన్తో ఇబ్బంది పడుతున్నారా..ఇదిగో పరిష్కారం వీడియో
చర్మ పిగ్మెంటేషన్ వీటినే మంగు మచ్చలు అని కూడా అంటారు. అతినీలలోహిత కిరణాలకు ఎక్కువగా గురికావడం వల్ల సూర్యరక్షణ మచ్చలు లేదా హైపర్ పిగ్మెంటేషన్ సంభవిస్తుంది. గర్భం, గర్భ నిరోధక మాత్రలు లేదా హార్మోన్ల అసమతుల్యత వల్ల మొలాస్మా అనే మచ్చలు ఏర్పడతాయి. ఇవి ముఖ్యంగా మహిళల్లో సాధారణం. ముటిమలు, గాయాలు లేదా చర్మ వ్యాధుల తర్వాత మిగిలే గుర్తులు కూడా పిగ్మెంటేషన్ కు దారితీస్తాయి. అదనంగా వృద్ధాప్యం, ఒత్తిడి, ఆహారంలో విటమిన్ లోపాలు కూడా చర్మ రంగును అసమానంగా మార్చవచ్చు. ఈ కారణాలను అర్థం చేసుకోవడం వల్ల సరైన చికిత్సను ఎంచుకోవడం సులభమవుతుంది. ఈ పిగ్మెంటేషన్ సమస్యను కొన్ని సహజ రెమెడీస్ తో నివారించవచ్చు. ఇందులో ముఖ్యమైనది నిమ్మరసం.
చర్మంపై మచ్చలను తొలగించడంలో సహజమైన బ్లీచింగ్ లా పనిచేస్తుంది. ఒక స్పూన్ నిమ్మరసంలో అర టీస్పూన్ పంచదార కలిపి ఈ మిశ్రమాన్ని మచ్చలపై రాసి రెండు మూడు నిమిషాలు సున్నితంగా స్క్రబ్ చేయండి. 10 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. నిమ్మరసంలోని సిట్రిక్ యాసిడ్ ముదురు గుర్తులను తేలిక పరుస్తుంది. పంచదార చర్మంలోని మృతకణాలను తొలగిస్తుంది. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అయితే సున్నితమైన చర్మం ఉన్నవారు ముందుగా పరీక్షించి అప్లై చేసుకోవాలి. ఎందుకంటే నిమ్మరసం చికాకు కలిగించవచ్చు. కలబంద చర్మాన్ని శాంతపరచడంతో పాటు పిగ్మెంటేషన్ ను తగ్గిస్తుంది. తాజా కలబంద జెల్లో ఒక విటమిన్ ఈ కాప్సుల్ ను కలిపి ఈ మిశ్రమాన్ని మచ్చలపై అప్లై చేసి 10 నుంచి 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. కలబందలోని అలోయిన్ మెలనీన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. మరియు విటమిన్ ఈ చర్మాన్ని పోషిస్తుంది. ఇది రాత్రి సమయంలో రోజూ ఉపయోగించడం వల్ల చర్మం బ్రైట్ గా అండ్ సాఫ్ట్ గా కనిపిస్తుంది. పసుపు యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ రక్షణాలను కలిగి ఉంటుంది. ఇది చర్మ మచ్చలను తగ్గిస్తుంది.
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
