Andhra: ఉదయాన్నే ఇంటి నుంచి పాఠశాలకు వెళ్లారు.. ఎంతకూ తిరిగిరాలేదు.. ఆరా తీయగా
ఉదయం ఇంటి నుంచి పాఠశాలకు వెళ్లిన విద్యార్థినులు.. స్కూల్ ముగియగానే సాయంత్రం ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబీకులు అన్ని చోట్ల వెతికారు.. కానీ ఎక్కడా వాళ్ల జాడ కనిపించలేదు. ఆ తర్వాత ఏం జరిగింది.? ఇక్కడ చూసేయండి. ఓ సారి ఈ స్టోరీపై లుక్కేయండి.
శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు ప్రభుత్వ పాఠశాల నుందు అదృశ్యమైన ముగ్గురు బాలికలను పోలిసులు పట్టుకున్నారు. రోజు మాదిరిగానే మంగళవారం ఉదయం ఇంటి నుంచి పాఠశాలకు వెళ్లిన విద్యార్థినులు సాయంత్రం పాఠశాల ముగియగానే ఇంటికి వెళ్లకుండా అదృశ్యమయ్యారు. తమ పిల్లలు ఎంతసేపటికి రాకపోవడంతో బంధువులు,స్నేహితుల ఇళ్లలో ఆరా తీయగా బాలికల ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఎస్సై మక్బుల్ బాషా సిబ్బందితో కలిసి దర్యాప్తు చేపట్టారు. బాలికలు తనకల్లు నుండి ఆర్టీసీ బస్సులో మొలకలచెరువుకు వెళ్లి అక్కడ తన మిత్రులతో కలిసి అనంతపురం వెళ్లినట్లు గుర్తించారు. వెంటనే అక్కడికి వెళ్లి బాలికలను పట్టుకొని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. తప్పిపోయిన ఏడు గంటల్లోనే తమ పిల్లలను తమకు అప్పగించడంతో పోలీసులు స్పందించిన తీరుపై తల్లితండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
ఇది చదవండి:
మహిళ స్నానం చేస్తుండగా మెరిసిన ఏదో లైట్.. ఏంటా అని పరిశీలించగా
రోడ్డుపై పిండం పెట్టారనుకునేరు.. కాస్త జూమ్ చేసి చూడగా కళ్లు తేలేస్తారు
వాష్రూమ్ అంటూ ఇంట్లోకి చొరబడిన డెలివరీ బోయ్ ఏం చేశాడో తెలుసా!
ఒక్క విద్యార్థి.. ముగ్గురు సిబ్బంది.. పాఠశాల ఆశ్చర్యకర గాథ!
పెన్షన్ కోసం బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. బ్యాలెన్స్ చూసి షాక్
రైలు కిటికీకి వేలాడుతూ 15 కి.మీ. ప్రయాణం..!
కదులుతున్న రైలులో పూజలు.. రైల్వే అధికారుల రియాక్షన్ ఇదే!
అక్కడ వెంకన్న ఆలయంలో..ఇక్కడ శివయ్య ఆలయంలో
ఫోన్లో బిజీగా ఉన్న షాపు యజమాని.. ఓ కిలాడీ లేడీ ఏం చేసిందో చూడండి

