మంచిర్యాల జిల్లాలో రెచ్చిపోయిన స్మగ్లర్లు

Updated on: Oct 09, 2025 | 4:54 PM

మంచిర్యాల జిల్లాలోని కవ్వాల్ టైగర్ జోన్‌లో స్మగ్లర్లు యధేచ్ఛగా కలపను అక్రమ రవాణా చేస్తున్నారు. తానిమడుగు బీట్‌లో ఆరు కిలోమీటర్ల మేర 350కి పైగా టేకు చెట్లను నరికేశారు. పక్క జిల్లాలకు దుంగలను తరలించగా, తాళ్లపేట రేంజ్ అటవీశాఖ సిబ్బంది తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులు ఇంతవరకు స్పందించలేదు.

మంచిర్యాల జిల్లాలో కలప స్మగ్లర్లు తమ ఆగడాలను కొనసాగిస్తున్నారు. కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో యధేచ్ఛగా టేకు చెట్లను నరికివేస్తూ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. తానిమడుగు బీట్‌లో సుమారు ఆరు కిలోమీటర్ల మేర స్మగ్లర్లు చెట్లను నరికేశారు. ఈ సంఘటనలో 350కి పైగా టేకు చెట్లను అక్రమంగా నరికివేసినట్లు వెల్లడైంది. నరికిన కలప దుంగలను గుట్టుచప్పుడు కాకుండా పక్క జిల్లాలకు తరలించారు. ఈ భారీ ఎత్తున జరిగిన కలప నరికివేతపై తాళ్లపేట రేంజ్ అటవీశాఖ సిబ్బంది తీరుపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

RTC బస్సు ఛార్జీల పెంపు పై KTR, హరీష్ రావు ఫైర్

స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండగా ఉంటానని జగన్ హామీ

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. కిక్కిరిసిన భక్తులతో ఆలయ వీధులు

దీపిక Vs త్రిప్తీ.. గ్యాప్‌ ఉన్నట్టా.. లేనట్టా

కేర్ తో పాటు.. స్పీడు కూడా పెంచిన రవితేజ.. మోత మోగనున్న మాస్ జాతర