దెయ్యం వదిలిస్తానని దెబ్బలు .. తాళలేక మహిళ మృతి వీడియో
సమాజం అభివృద్ధి వైపు దూసుకుపోతున్నా.. కొన్ని ప్రాంతాల్లో ఇంకా మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. చేతబడి, క్షుద్రపూజల పేరుతో పలు ప్రాంతాల్లో అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. అనారోగ్యంతో ఉన్న తల్లిని ఆసుపత్రికి తీసుకెళ్లకుండా భూతవైద్యుడి దగ్గరికి తీసుకెళ్లాడో కొడుకు. కొడుకు నిర్వాకంతో ఆ తల్లి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
తాజాగా బీహార్ లో చేతబడి చేస్తున్నారనే అనుమానంతో ఓ కుటుంబంలోని ఐదుగురిని గ్రామస్తులు సజీవ దహనం చేశారు. అదేవిధంగా కర్ణాటక లో దెయ్యం పట్టిందని ఓ మహిళను కొట్టిచంపారు.వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ జిల్లాకు చెందిన 55 ఏళ్ల మహిళ గీతమ్మ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. దాంతో ఆమె కుమారుడు ఆమెను భూత వైద్యం చేసే దంపతుల దగ్గరికి తీసుకెళ్లాడు. వాళ్లు దెయ్యాన్ని వదిలించే పేరుతో సోమవారం రాత్రి 9.30 గంటల నుంచి 1.30 గంటల వరకు నాలుగు గంటలపాటు చిత్రవధ చేశారు. చేతులతో, కర్రలతో తీవ్రంగా కొట్టారు. దాంతో ఆమె దెబ్బలకు తాళలేక ప్రాణాలు కోల్పోయింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలి కుమారుడిని, బూత వైద్యం చేసిన దంపతులను అరెస్ట్ చేశారు.
మరిన్ని వీడియోల కోసం :
ఆలియాకు మాజీ పీఏ టోకరా..ఏకంగా రూ.77 లక్షలు వీడియో
వందేళ్ల ప్రయాణం ముగిసింది.. వైరల్ వీడియో
ప్లాస్టిక్ను తినేస్తున్న పురుగులు..వైరల్ వీడియో
లక్కీ డ్రా తీయండి.. కూరగాయలు ఉచితంగా పొందండి
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి.. కుట్లేసిన మున్నాభాయ్
నా చీర లాగాడు !! నాసిక్ టీసీఎస్ ఉద్యోగిని ఆవేదన
లంచం తీసుకుంటూ పట్టుబడిన స్టేట్ టాపర్
సర్ప్రైజ్ గిఫ్ట్ అని పిలిచింది.. కుర్చీకి కట్టేసి మరీ.. అలా ఎలా ?
విచారణకు వచ్చి.. నగలు కొట్టేసిన పోలీసులు
పది రూపాయల స్నాక్.. పది కోట్ల వ్యూస్

