దోపిడీ దొంగ అన్న అనుమానంతో ఓ యువకుడిని స్థానికులు ఏంచేశారంటే..

Edited By:

Updated on: Mar 10, 2024 | 3:10 PM

శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డులో శుక్రవారం అర్దరాత్రి అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తికి దేహ శుద్ధి చేశారు స్థానికులు. మున్సిపాలిటీ పరిధిలోని అన్నపూర్ణ ఆశ్రమం వీధిలోని బడ్డి పొలమ్మ గుడి సమీపంలో గుడియా సంతోష్ కుమార్ అనే వ్యక్తి ఇంటి ఆవరణలోకి గుర్తు తెలియని వ్యక్తి చొరబడ్డాడు. అది గమనించిన ఇంటి యజమాని సంతోష్ కుమార్ స్థానికుల సాయంతో ఆ వ్యక్తిని పట్టుకొని బంధించారు.

Follow Us