AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కూచిపూడి కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన నాట్యమయూరి

కూచిపూడి కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన నాట్యమయూరి

Phani CH
|

Updated on: Jan 28, 2026 | 8:22 AM

Share

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో కూచిపూడి నృత్యకారిణి దీపికా రెడ్డికి పద్మశ్రీ లభించింది. 55 ఏళ్ల కూచిపూడి ప్రస్థానంలో ఆమెకు ఈ అరుదైన గౌరవం దక్కింది. ఐదేళ్ల వయసు నుంచే నృత్యం నేర్చుకున్న దీపికా రెడ్డి, గురువు వెంపటి చిన్న సత్యం శిష్యరికంలో ప్రావీణ్యం పొందారు. దేశ విదేశాల్లో వేల ప్రదర్శనలు ఇచ్చి, వేల మంది విద్యార్థులను తయారు చేశారు. ఈ అవార్డు ఆమె కళా సేవకు నిదర్శనం.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మపురస్కారాల్లో తెలుగు వారికి తెలుగు రాష్ట్రాల నుంచి పలువురికి అవార్డు లభించింది అందులో కళా విభాగానికి గాను దీపిక రెడ్డి గారికి కూచిపూడి కి చేసిన సేవలకు గాను పద్మశ్రీ అవార్డు లభించింది. కళా విభాగంలో కూచిపూడి నృత్యానికి దీపికా రెడ్డికి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును బహూకరించింది. సుమారు 55 ఏళ్ల కూచిపూడి ప్రయాణంలో దీపికా రెడ్డికి పద్మ పురస్కారం లభించింది. ఐదేళ్ల వయసు నుంచే క్లాసికల్ డాన్స్ లో నేర్చుకుంటున్న దీపికా రెడ్డి మొదట తన తల్లి ద్వారా భారత నాట్యం నేర్చుకొని కూచిపూడి లో ప్రావీణ్యం పొందారు ఇప్పటివరకు దేశ విదేశాల్లో వేల ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు తన శిష్యరికంలో వేల మంది విద్యార్థులను తయారు చేశారు.దీపికా రెడ్డి 1965 సెప్టెంబర్ 15న హైదరాబాద్‌లో జన్మించారు. ఆమె బాల్యంలోనే, 6 ఏళ్ల వయస్సులో కూచిపూడి నృత్యం నేర్చుకోవడం ప్రారంభించారు. వివాహం తర్వాత భర్త ప్రోత్సాహంతో వెంపటి చిన్న సత్యం గారి ప్రత్యేక శిక్షణ పొందారు. ఈమె గురువు వెంపటి చిన్న సత్యం గారు కూడా కూచిపూడి విభాగంలోనే పద్మ శ్రీ పురస్కారాన్ని అందుకోవటంతో గురువుకు తగ్గ శిష్యురాలుగా చాలా ఆనందంగా ఉందని దీపిక రెడ్డి చెప్పారు

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Khairatabad: ఖైరతాబాద్ లో కుక్కల స్వైరవిహారం

Nara Lokesh: అధికారంలో ఉన్నాం.. అలకలు వద్దు

Bhadrachalam: మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పని.. చావుకు దగ్గరగా వెళ్లిన చిన్నారులు

Akira Nandan: నటించకుండానే పవన్ కొడుకు సినిమా పూర్తి

కండలపై క్రేజు.. స్టెరాయిడ్లపై మోజు