AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covishield-Covaxin video: మహారాష్ట్రలో దారుణం.. విద్యార్థులకు తప్పుడు టీకాలు.. కోవాక్సిన్‌కు బదులు కోవిషీల్డ్..(వీడియో)

Covishield-Covaxin video: మహారాష్ట్రలో దారుణం.. విద్యార్థులకు తప్పుడు టీకాలు.. కోవాక్సిన్‌కు బదులు కోవిషీల్డ్..(వీడియో)

Anil kumar poka
| Edited By: KVD Varma|

Updated on: Jan 24, 2022 | 10:45 PM

Share

నాసిక్ జిల్లాలో 15 నుండి 18 సంవత్సరాల వయస్సు గల కౌమారదశకు కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించారు. అయితే యేవాలా తాలూకాలోని పటోడాలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఉదంతం వెలుగులోకి వచ్చింది.



దేశంలో ఇవాళ్టి నుంచి 15 నుంచి 18 ఏళ్లలోపు టీనేజ్ పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇందుకోసం జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని కేంద్రం ప్రకటించింది. కేంద్రం అందించిన మార్గదర్శకాల ప్రకారం, 15 నుంచి 18 ఏళ్లలోపు వయస్సు గల పిల్లలకు మాత్రమే కోవాక్సిన్ ఇవ్వనున్నారు. ఇందుకోసం కోవిన్ యాప్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చని కోవిన్ ప్లాట్‌ఫాం చీఫ్ డా.ఆర్.ఎస్.శర్మ తెలిపారు.

అయితే, దేశంలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే, మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో 15 నుండి 18 సంవత్సరాల వయస్సు గల కౌమారదశకు కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించారు. అయితే యేవాలా తాలూకాలోని పటోడాలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక విద్యార్థికి కోవాక్సిన్‌కు బదులుగా కోవిషీల్డ్ మోతాదును అందించారు. దీంతో ఆ యువకుడి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Published on: Jan 20, 2022 09:47 PM