వ్యక్తిని చంపేసి, భార్యగా నటించి.. ఆపైన వీడియో
కర్ణాటకలో ఐదు కోట్ల ఇన్సూరెన్స్ కోసం ఓ ముఠా ఘోరమైన పథకం పన్నింది. పక్షవాతంతో బాధపడుతున్న గంగాధర్ అనే వ్యక్తిని హత్య చేసి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించింది. ముఠాలోని ఓ మహిళ చనిపోయిన వ్యక్తి భార్యనని నటించి భీమా క్లెయిమ్ చేయగా, అసలు భార్య శారదమ్మ అనుమానంతో ఈ కుట్ర బట్టబయలైంది. పోలీసులు 24 గంటల్లో నిందితులను అరెస్టు చేశారు.
మానవత్వం నశించిపోతున్న ఈ కాలంలో మనిషి తన స్వార్థం కోసం ఎంతటి నేరాలకైనా వెనుకాడటం లేదు. కర్ణాటకలో జరిగిన ఓ ఘటన దీనికి నిదర్శనం. హోస్పేటకు చెందిన గంగాధర్ తన పేరు మీద ఐదు కోట్ల రూపాయలకు భీమా చేయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కొందరు వ్యక్తులు గంగాధర్ను చంపి ఇ న్సూరెన్స్ డబ్బులు కొట్టేయాలని పన్నాగం పన్నారు.పథకం ప్రకారం, అనారోగ్యంతో బాధపడుతున్న గంగాధర్ను హత్య చేశారు. అనంతరం ఆయన మృతదేహాన్ని శివారుల్లోకి తీసుకెళ్లి, టీవీఎస్ స్కూటర్పై కూర్చోబెట్టి కారుతో ఢీకొట్టి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈ దారుణానికి పాల్పడిన ముఠాలోని ఓ మహిళ తాను గంగాధర్ భార్యనని చెప్పుకుంటూ భీమా డబ్బుల కోసం ఇన్సూరెన్స్ కంపెనీని ఆశ్రయించింది.
మరిన్ని వీడియోల కోసం :
మధ్యప్రదేశ్ను వణికిస్తున్న కొత్త వైరస్ వీడియో
రోడ్డుమధ్యలో వింత ఆకారం..ఆందోళనలో స్థానికులు వీడియో
దసరా సర్ప్రైజ్ ఇచ్చిన సామ్.. ఆనందంలో ఫ్యాన్స్ వీడియో
ఒక్క షో కోసం ఎంతో కష్టపడ్డా.. కానీ ఇప్పుడు వీడియో
గాల్లో ఉండగా విమానంలో భారీ కుదుపులు.. ప్రయాణికుల హాహాకారాలు
కనలేక కొనేస్తున్న దంపతులు.. అడ్డగోలుగా అమ్మేస్తున్న దళారులు
పైకి.. కిట్ కాట్ చాక్లెట్ ప్యాకెట్.. ఓపెన్ చేస్తే..
కదులుతున్న రైలు నుంచి దూకేసిన ప్రయాణికులు.. ఏం జరిగిందో తెలుసా!
ప్రపంచంలోనే ధనిక గ్రామం.. భారత్లోనే...!
వానలో ఈ చెట్టు కింద నిల్చుంటే చావు ఖాయం!
ఇందూరు నయాగర జలపాతం ఎప్పుడైనా చూశారా?

