రైలు ప్రయాణికులకు షాకింగ్‌ న్యూస్‌.. ఇకపై అలా కుదరదు..

Updated on: Apr 11, 2025 | 5:38 PM

భారతదేశంలో ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులు రైలులో ప్రయాణిస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వేశాఖ పలు ఏర్పాట్లు చేస్తోంది. రైలులో ప్రయాణించే ప్రయాణికులకు లగేజీ తప్పకుండా ఉంటుంది. దూర ప్రాంతాలకు వెళ్లేవారికి లగేజీ ఎక్కువగానే ఉంటుంది. ఈ లగేజీపై రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

ఇకపై రైల్లో ప్రయాణికులు తీసుకువెళ్లే లేగజీపై పరిమితి విధించాలని నిర్ణయించింది. ఆ మేరకు భారత రైల్వే శాఖ కొత్తరూల్స్‌ తీసుకొచ్చింది. రైలు ప్రయాణంలో వెంట తీసుకెళ్లే లగేజీపై రైల్వే శాఖ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. మోసుకెళ్లేది మేమే కదా అని ఇష్టారీతిన లగేజీ తీసుకెళ్లడం ఇకపై కుదరదని తేల్చిచెప్పింది. విమానాశ్రయాల తరహాలో రైల్వే స్టేషన్లలో కూడా లగేజీకి చార్జీలు వసూలు చేయనున్నారు. కొత్తగా అమలులోకి వచ్చిన నిబంధనల ప్రకారం.. ఏసీ ఫస్ట్ క్లాస్ ప్రయాణికులకు 70 కేజీల వరకు లగేజీని అనుమతిస్తారు. ఏసీ 2 టైర్ ప్రయాణికులు 50 కేజీలు, ఏసీ 3 టైర్, స్లీపర్, జనరల్ ప్రయాణికులు తమ వెంట 40 కేజీల లగేజీని వెంట తీసుకెళ్లవచ్చునని రైల్వే శాఖ తెలిపింది. అనుమతించిన బరువు కంటే ఎక్కువ బరువున్న లగేజీని తీసుకెళుతూ పట్టుబడితే జరిమానా విధిస్తామని అధికారులు స్పష్టం చేశారు. టికెట్ రేటు కంటే ఈ జరిమానా ఆరు రెట్లు ఎక్కువ ఉంటుందని చెప్పారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మంచం తో కారు తయారుచేసి.. రోడ్డుపై తిరిగిన వ్యక్తి.. కట్ చేస్తే షాకిచ్చిన పోలీసులు

అమ్మకానికి కన్యత్వం.. రూ. 18 కోట్లకు కొన్న స్టార్‌ హీరో

‘నా బిడ్డ క్షేమంగా ఇంటికొచ్చాడు..’ చిరు ఎమోషనల్ ట్వీట్