AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు కొత్త 'తేజస్'

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు కొత్త ‘తేజస్’

Phani CH
|

Updated on: Oct 17, 2025 | 10:00 PM

Share

భారత వాయుసేన తన శక్తిని బలోపేతం చేసుకుంటూ అధునాతన ఎల్సీఏ తేజస్ ఎంకే1ఏ యుద్ధ విమానాన్ని ప్రవేశపెట్టింది. దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ ఫైటర్ జెట్ ఎయిర్-టు-ఎయిర్ రీఫ్యూయలింగ్, 3,500 కిలోల ఆయుధ సామర్థ్యం వంటి ప్రత్యేకతలతో మిగ్-21 స్థానాన్ని భర్తీ చేయనుంది. భారతదేశం తన రక్షణ సామర్థ్యాలను గణనీయంగా బలోపేతం చేసుకుంటోంది.

భారతదేశం తన రక్షణ సామర్థ్యాలను గణనీయంగా బలోపేతం చేసుకుంటోంది. ఇందులో భాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోకి ఎల్సీఏ తేజస్ ఎంకే1ఏ యుద్ధ విమానాన్ని ప్రవేశపెట్టింది. సరిహద్దుల్లో ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా దీటుగా ఎదుర్కొనేలా ఈ అధునాతన ఫైటర్ జెట్ రూపొందించబడింది. మహారాష్ట్రలోని నాసిక్ ఎయిర్‌బేస్‌లో వాటర్ సెల్యూట్ అందుకున్న అనంతరం ఇది గాల్లోకి ఎగిరింది.
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) తన మూడవ ఉత్పత్తి కేంద్రంలో ఈ విమానాన్ని తయారు చేస్తోంది, ప్రతి సంవత్సరం 16 విమానాలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. తేజస్ ఎంకే1ఏ అడ్వాన్స్‌డ్ మల్టీ-రోల్ ఫైటర్ జెట్. దీనికి ఎయిర్-టు-ఎయిర్ రీఫ్యూయలింగ్ సామర్థ్యం ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ అధికారుల ఇంట్లో తవ్వేకొద్దీ బయటపడుతున్న అవినీతి సంపద

దేశంలో నకిలీ ORS బ్యాన్.. పోరాడి గెలిచిన డా.శివరంజని

గ్రీన్ క్రాకర్స్ తో కాలుష్యానికి చెక్..మరి వాటిని గుర్తుపట్టడం

విశాఖలో అతి పెద్ద ‘గూగుల్ ఏఐ హబ్’

ఒక్క రోజులోనే రూ.3,770 పెరిగిన బంగారం.. శుక్రవారం తులం బంగారం ఎంతంటే ??