విష పదార్థాలతో కుక్కలను చంపినట్టు గుర్తింపు

Updated on: Jan 02, 2026 | 5:38 PM

ఎన్టీఆర్ జిల్లాలోని వెలగలేరులో 250 వీధి కుక్కలను విష ప్రయోగం చేసి చంపినట్టు జంతు సేవా సంస్థ గుర్తించింది. దీనిపై పంచాయతీ కార్యదర్శిపై కేసు నమోదైంది. కుక్కల బెడద తీవ్రం కావడంతోనే ఈ చర్య తీసుకున్నామని పంచాయతీ సిబ్బంది చెబుతుండగా, కుక్కల వల్ల లక్షలాది రూపాయల నష్టం జరిగిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్టీఆర్ జిల్లా జీ కొండూరు మండలం వెలగలేరులో దారుణం చోటు చేసుకుంది. పంచాయతీ సిబ్బంది సుమారు 250 వీధి కుక్కలను విష పదార్థాలతో చంపినట్లు జంతు సేవా సంస్థ గుర్తించింది. అయితే, అనధికారికంగా ఈ సంఖ్య 450కి పైగానే ఉంటుందని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ సంఘటనపై జంతు సేవా సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. జీ కొండూరు పోలీస్ స్టేషన్‌లో పంచాయతీ కార్యదర్శిపై కేసు నమోదైంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మరింత వణికించనున్న జనవరి.. పెరగనున్న చలి తీవ్రత

Gold Price Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె

రైలు ప్రయాణికులకు గుడ్‌ న్యూస్.. 30 నిమిషాల ముందు టికెట్ బుక్ చేసుకునే ఫెసిలిటీ

కలవరపెడుతున్న స్క్రబ్‌ టైఫస్‌..22 మంది మృతి