సచివాలయంలో గంజాయి మొక్క కలకలం !!

Updated on: Oct 04, 2023 | 9:48 AM

గ్రామ సచివాలయంలో గంజాయి మొక్క పెంపకం కలకలం రేపుతుంది.‌ గందరగోళానికి గురైన అధికారులు పరుగులు తీశారు. ఏం జరిగిందో అంతా తెలుసుకునే లోపే వీడియోలు వైరల్‌గా మారాయి. కొందరు ఆకతాయిలు చేసిన పనికి అక్కడ ఉద్యోగ విధులు నిర్వహిస్తున్న యావత్ అధికారులు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగుడెం సచివాలయం-2 ప్రాంగణంలో కొన్ని మొక్కలు పెరుగుతున్నాయి.

గ్రామ సచివాలయంలో గంజాయి మొక్క పెంపకం కలకలం రేపుతుంది.‌ గందరగోళానికి గురైన అధికారులు పరుగులు తీశారు. ఏం జరిగిందో అంతా తెలుసుకునే లోపే వీడియోలు వైరల్‌గా మారాయి. కొందరు ఆకతాయిలు చేసిన పనికి అక్కడ ఉద్యోగ విధులు నిర్వహిస్తున్న యావత్ అధికారులు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగుడెం సచివాలయం-2 ప్రాంగణంలో కొన్ని మొక్కలు పెరుగుతున్నాయి. అయితే పచ్చదనం కోసమని సిబ్బంది వాటిని సంరక్షిస్తున్నారు. అందులో పూల మొక్కలైన బంతితోపాటు వివిధ రకాల మొక్కలు ఉన్నాయి. వాటిలో బంతి మొక్కను పోలివున్న ఓ మొక్కని కొందరు ఆకతాయిలు వీడియో తీసి యార్నగుడెం సచివాలయం-2 లో గంజాయి మొక్కని పెంచుతున్నారంటూ వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ చేశారు. అది నిజమా . అబద్దమా.. అని సంబంధిత అధికారుల వద్ద నుండి వివరణ తీసుకోకుండానే ఒక గ్రూపు నుంచి మరొక గ్రూపు క్షణాల్లో ఆ వార్త దావానంలో వ్యాపించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాబోయ్ ఎంతపెద్ద తిమింగలమో !! కేరళ తీరంలో టెన్షన్

అన్నదానంలో 32 వంటకాలు.. తిన్న వారికి తిన్నంత

Black Magic: నగ్నంగా గోదావరి ఒడ్డుపై తాంత్రిక పూజలు చేస్తుండగా ??

Boney Kapoor: ఇంతకీ శ్రీదేవి మరణానికి కారణం ఏంటి ?? సీక్రెట్ బయటపెట్టిన భర్త

రైతు కష్టం తీర్చిన స్టూడెంట్ !! పేటెంట్ పొంది రికార్డ్ !!

Loading...
Unable to load recommendations.
Follow Us