చందా ఇవ్వలేదని 4 కుటుంబాల కుల బహిష్కరణ

Updated on: Sep 11, 2025 | 4:31 PM

జగిత్యాల జిల్లా కల్లేడ గ్రామంలో గణపతి చందా చెల్లించకపోవడంతో నాలుగు కుటుంబాలను కుల బహిష్కరణ చేశారు. సంఘ సభ్యులు ఈ కుటుంబాలతో మాట్లాడిన వారికి 25 వేల రూపాయల జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించారు. అధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. జగిత్యాల జిల్లా కల్లేడ గ్రామంలో కుల బహిష్కరణ సంఘటన కలకలం రేపుతోంది.

జగిత్యాల జిల్లా కల్లేడ గ్రామంలో కుల బహిష్కరణ సంఘటన కలకలం రేపుతోంది. గణపతి ఉత్సవాలకు చందాగా 1116 రూపాయలు చెల్లించలేదనే కారణంతో నాలుగు కుటుంబాలను గ్రామ సంఘం బహిష్కరించింది. ఈ కుటుంబాలతో ఏ వ్యక్తి మాట్లాడినా 25,000 రూపాయల జరిమానా విధించాలని నిర్ణయించారు. బాధిత కుటుంబాల ప్రతినిధులు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. కుల బహిష్కరణ చట్టవిరుద్ధమని, బాధితులకు న్యాయం చేకూర్చాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దేశంలోని 12 ప్రాంతాల్లో స్పెషల్ సెల్ ఆపరేషన్

రంగు మారిన సముద్రం.. భయాందోళనలో ప్రజలు

Weather Update: ఏపీలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు

పేలిపోయిన ఏసీ.. ముగ్గురు మృతి

Apple Event: యాపిల్ కావాలా నాయనా