వీళ్లు మనుషులేనా? మురుగు గుంటలో కోడలిని పూడ్చి..లేచిపోయిందని ప్రచారం

Updated on: Jun 26, 2025 | 8:48 PM

మానవత్వానికే మచ్చ తెచ్చే దారుణ సంఘటన ఒకటి.. హర్యానాలోని ఫరీదాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. అదనపు కట్నం కోసం జరిగిన ఈ దారుణహత్య వెనక.. కట్టుకున్న భర్త, అతడి తల్లి దండ్రులు కీలక పాత్రధారులనే వాస్తవం ఇప్పుడు వెలుగులోకి రావటంతో ఈ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు కలిసి చేసిన ఈ దారుణ హత్య రెండు నెలల తర్వాత బయటికి రావటంతో సభ్య సమాజం నివ్వెరబోతోంది.

వివరాల్లోకి వెళితే.. హర్యానాలోని ఫరీదాబాద్‌లోని రోషన్ నగర్ కు చెందిన అరుణ్‌కు, షికోహాబాద్ కు చెందిన తనూకు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే, వివాహం అయిన కొద్ది రోజుల నుంచే భర్త, అత్తమామలు అదనపు కట్నం కోసం తనూను వేధించడం మొదలు పెట్టారు. దీంతో ఆమె పుట్టింటికి చేరి, ఏడాది పాటు తల్లిదండ్రుల వద్దే ఉండిపోయింది. దీంతో.. కూతురు కాపురం నిలబెట్టేందుకు తనూ తండ్రి.. అప్పోసొప్పో చేసి కొంత సొమ్మును అల్లుడికి ముట్టజెప్పి.. అత్తవారింట్లో దిగబెట్టి వెళ్లాడు. అయినా.. వారి ఆశ తీరకపోగా, మళ్లీ తనూను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేశారు. కనీసం పుట్టింటివారితో మాట్లాడేందుకు కూడా ఆమెను అనుమతించకుండా అత్తమామలు ఆమెను కట్టడిచేశారు.

మరిన్ని వీడియోల కోసం :

భార్య ముక్కు కొరికేసిన భర్త.. అందంగా ఉందని కాదు వీడియో

చీర కట్టినా..చివరికి దొరికిపోయాడు వీడియో

రోడ్డు మధ్యలో స్కూటీ ఆపి..దానిపైనే కునుకేసిన వ్యక్తి ! ఎక్కడంటే వీడియో