Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కు.. గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం

Updated on: Mar 15, 2026 | 6:35 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త చెప్పింది ఏపీ సర్కార్. ఆయన హీరోగా నటిస్తున్న లేటేస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందించిన యాక్షన్ ఎంటర్టైనర్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఉగాది కానుకగా ఈ చిత్రాన్ని మార్చి 19న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బెనిఫిట్ షోతోపాటు టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇస్తూ మెమో జారీ చేసింది ఏపీ సర్కార్.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త చెప్పింది ఏపీ సర్కార్. ఆయన హీరోగా నటిస్తున్న లేటేస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందించిన యాక్షన్ ఎంటర్టైనర్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఉగాది కానుకగా ఈ చిత్రాన్ని మార్చి 19న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బెనిఫిట్ షోతోపాటు టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇస్తూ మెమో జారీ చేసింది ఏపీ సర్కార్. తాజాగా 10 రోజుల పాటు ఏపీలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా టికెట్ రేట్ల పెంపుకు ఆదేశాలు జారీ చేసింది గవర్నమెంట్. 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్స్‌లో 100 రూపాయలు, మల్టీప్లెక్సులలో 125 రూపాయలు పెంచుకోడానికి వెసలుబాటు కల్పించింది. మార్చి 19 తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో అదనపు షోలకు పర్మిషన్ ఇవ్వగా.. జీఎస్టీతో కలిపి దీని టికెట్ ధరను 500 రూపాయలు నిర్ణయించింది. ఇక ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకున్న ఉస్తాద్ సినిమాకు ఎలాంటి కట్స్ లేకుండా యూ/ఏ సర్టిఫికెట్ వచ్చినట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఇక ఈ మూవీ రన్ టైమ్ దాదాపు 2 గంటల 34 నిమిషాలుగా ఉండనుంది. ఒక్క తెలంగాణలో టికెట్ రేట్స్‌ విషయం మినహా.. ఈ మూవీ వరల్డ్ వైడ్ రిలీజ్‌కు రెడీ గా ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మోనాలిసా లవ్‌ మ్యారేజ్‌ పై.. తండ్రి, మామ ఎమోషనల్ రియాక్షన్

సినిమా చూడాలా లేక చదవుతూ కూర్చోవాలా ?? సెన్సార్ కొత్త నిర్ణయంపై హాట్ డిస్కషన్

Anasuya: అనసూయకు వేధింపులు నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

కాకినాడ అధికారులకు చుక్కలు చూపిస్తున్న పెద్ద పులి

చీకటిపడ్డాక చెరువు గట్టుపై వణుకు పుట్టించే సీన్.. అసలేం జరిగిందంటే..

Follow Us