క్లాస్‌ టు మాస్‌.. మాస్‌ టు క్లాస్‌ రూటు మారుస్తున్న టాప్‌ స్టార్స్‌

Updated on: Apr 26, 2026 | 12:30 PM

టాలీవుడ్ ప్రముఖ హీరోలు తమ సినిమాల జానర్‌లను మార్చుకుంటున్నారు. క్లాస్ సినిమాలు చేసినవారు మాస్ వైపు, మాస్ సినిమాలు చేసినవారు క్లాస్ కథల వైపు మొగ్గు చూపుతున్నారు. చిరంజీవి, అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్స్ గ్లోబల్ ఆడియన్స్‌ను లక్ష్యంగా చేసుకుంటూ సరికొత్త కథాంశాలను ఎంచుకుంటున్నారు.

టాలీవుడ్‌లో ప్రముఖ హీరోలు తమ సినీ ప్రయాణంలో రూట్ మారుస్తూ సరికొత్త ట్రెండ్‌ను సృష్టిస్తున్నారు. ఇన్నాళ్లూ క్లాస్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన స్టార్స్ ఇప్పుడు మాస్ కథల వైపు దృష్టి సారిస్తుండగా, మాస్ చిత్రాలకు పేరుగాంచిన నటులు క్లాస్ కథలకు పచ్చజెండా ఊపుతున్నారు. అంతేకాకుండా, స్థానిక కథలతో విజయాలు సాధించిన కొందరు హీరోలు గ్లోబల్ ఆడియన్స్‌ను లక్ష్యంగా చేసుకుని అంతర్జాతీయ స్థాయి కంటెంట్‌ను సిద్ధం చేస్తున్నారు.మెగాస్టార్ చిరంజీవి క్లాస్ టచ్‌ తర్వాత మాస్ టర్న్ తీసుకుని, బాబీ దర్శకత్వంలో ఓ మాస్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. అల్లు అర్జున్ రాకాతో, మహేష్ బాబు వారణాసితో గ్లోబల్ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు.

Follow Us