TOP 9 ET News: కోర్టు సీరియస్..| గ్లోబల్ రేంజ్‌.. 500కోట్లు పక్కా..

|

Jun 28, 2023 | 8:28 PM

ఆదిపురుష్ సినిమాపై వివాదాలు కొనసాగుతున్నాయి. సినిమాలోని కొన్ని డైలాగ్‌లు అభ్యంతరకంగా ఉన్నాయంటూ కొంత మంది కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంపై స్పందించిన అలహాబాద్‌ హైకోర్టు, సెన్సార్‌ బోర్డ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి డైలాగ్స్‌కు అనుమతించి భవిష్యత్తు తరాలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారని

ఆదిపురుష్ సినిమాపై వివాదాలు కొనసాగుతున్నాయి. సినిమాలోని కొన్ని డైలాగ్‌లు అభ్యంతరకంగా ఉన్నాయంటూ కొంత మంది కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంపై స్పందించిన అలహాబాద్‌ హైకోర్టు, సెన్సార్‌ బోర్డ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి డైలాగ్స్‌కు అనుమతించి భవిష్యత్తు తరాలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారని మండిపడింది. దాంతో పాటే.. ఈ మూవీ మేకర్స్ కోర్టుకు హాజరు కాకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. అయితే ఇప్పటికే సినిమా నుంచి ఆ డైలాగ్స్‌ను తొలగించింది చిత్రయూనిట్‌. ఇండస్ట్రీలోని పలు అంశాల గురించి.. హీరోల గురించి వారి సినిమాల గురించి మాట్లాడుతూ.. అందరి నోళ్లలో నానే తమ్మా రెడ్డి.. తాజాగా ప్రభాస్ ప్రాజెక్ట్ కె గురించి ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రాజెక్ట్ కె సినిమా సెట్‌కు తాను వెళ్లానన్న తమ్మా రెడ్డి.. ఈ సినిమాను డైరెక్టర్ నాగ్ అశ్విన్ తీర్చిదిద్దే విధానం బాగుందన్నారు. అలాగే ప్రభాస్‌తో పాటు.. అమితాబ్‌, కమల్ హాసన్, దీపిక లాంటి స్టార్ క్యాస్ట్ ఉన్నారు కాబట్టి… ఈసినిమాను ప్రాపర్ గా రిలీజ్‌ చేస్తే.. గ్లోబల్ సినిమా అవుతుందన్నారు. దాంతోపాటే గ్లోబల్‌గా రికార్డులు బ్రేక్ చేస్తుందంటూ.. ఖచ్చితంగా చెప్పారు. దాదాపు మొదటి రోజే.. 500 నుంచి 600 కోట్లు వచ్చేలా చేసుకుంటుందని కూడా ప్రెడిక్ట్ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Digital TOP 9 NEWS: బక్రీద్‌పై హైకోర్టు కీలక ఉత్తర్వులు | 102 డిగ్రీల జ్వరంతోనూ పవన్‌ డబ్బింగ్‌

Dhoni: ఫ్లైట్ లో క్యాండీ క్రష్ ఆడిన ధోని.. అమాంతం పెరిగిన యాప్ డౌన్లోడ్..

Venkateswara Swamy Idol: సముద్రంల దొరికిన నారయణుడి విగ్రహం..

Tadipatri: లింబోస్కేటింగ్‌ స్కేటింగ్ లో బుడ్డోడి రికార్డ్..

 

Follow us on