TOP 9 ET News: ఒడిశా అడవుల్లో సాహసాలు చేస్తున్న సూపర్ స్టార్

Updated on: Mar 07, 2025 | 4:09 PM

ఒడిశా అడవుల్లో సాహసాలు చేస్తున్నారట మన సూపర్ స్టార్ మహేష్‌. జక్కన్న డైరెక్షన్లో ssmb29 సినిమా చేస్తున్న మహేష్‌.. ప్రస్తుతం ఈ సినిమా సెకండ్ షెడ్యూల్లో భాగంగా ఒడిశాకు వెళ్లారట. అక్కడి అడవుల్లో జక్కన్న డైరెక్షన్లో కొన్ని కీ సీన్స్‌లో పాల్గొననున్నారట. అయితే మహేష్ ఒక్కడే కాదు.. మహేష్‌తో పాటు పృథ్విరాజ్‌ కూడా ఈ షెడ్యూల్లో పార్టిసిపేట్‌ చేస్తున్నారట.

2025 సంక్రాంతి సంబరం ముగిసి రెండు నెలలు అవుతుందో లేదో.. అప్పుడే నెక్ట్స్‌ ఇయర్ సంక్రాంతి సీజన్‌పై గురి పెట్టి మరీ కర్ఛీఫులు వేసేందుకు రెడీ అవుతున్నారు మన టాలీవుడ్ బడా హీరోలు అండ్ ప్రొడ్యూసర్లు. ఇప్పుటికే ఎన్టీఆర్‌తో షూటింగ్ మొదలెట్టిన ప్రశాంత్ నీల్.. తన సినిమాను 2026 సంక్రాంతి బరిలో నిలిపేందుకు తెగ ట్రై చేస్తున్నాడట. ఈ మూవీని నిర్మిస్తున్న మైత్రీ మేకర్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎన్టీఆన్ నీల్ సినిమాను పొంగల్‌కే తీసుకురావాలని డైరెక్టర్ కు గట్టిగా చెప్పారట. ఇక సంక్రాంతి సీజన్లో.. ఎప్పుడూ తన సినమా రిలీజ్ ఉండేలా చూసుకునే అనిల్ రావిపూడి.. చిరు హీరోగా తను తెరకెక్కించే సినిమాను కూడా ఎప్పటి లానే సంక్రాంతికే రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడట. ఈ ఇద్దరికి తోడు.. నవీన్ పొలిశెట్టి, రవితేజ కూడా తమ సినిమాలను సంక్రాంతి బరిలో దించేందుకు చూస్తున్నారట.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రభాస్.. ప్రశాంత్ వర్మ సినిమా ఫిక్స్! మరి రిషబ్ శెట్టి జై హనుమాన్ సంగతేంటంటే?

100 రోజుల్లో ప్రెగ్నెంటే టార్గెట్ ! నవ్విస్తూనే.. ఆలోచింపచేస్తున్న టీజర్

హీరోగా 10 సినిమాల్లో ఫెయిల్.. కట్ చేస్తే 1200కోట్లకు సంపాదన!

స్నేహితుడితో గడిపిన పాపానికి గర్భం దాల్చా.. ఆ తర్వాత