AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీతేజ కుటుంబానికి అండగా.. తెలంగాణ సర్కార్‌

శ్రీతేజ కుటుంబానికి అండగా.. తెలంగాణ సర్కార్‌

Phani CH
|

Updated on: Aug 28, 2025 | 9:04 PM

Share

పుష్ప- 2 సినిమా ప్రీమియర్‌ షో సందర్భంగా గతేడాది డిసెంబర్‌ 4న సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు శ్రీతేజ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. సుమారు 4 నెలల పాటు ఈ ఆస్పత్రిలోనే ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించారు.

ఈ సమయంలో హీరో అల్లు అర్జున్, నిర్మాత అల్లు అరవింద్, డైరెక్టర్ సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలతో పాటు పలువురు సినీ ప్రముఖులు పిల్లాడి మెడికల్ ట్రీట్మెంట్ కోసం ఆర్థిక సహాయం చేశారు. శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగుపడడంతో ఈ ఏడాది ఏప్రిల్ లో పిల్లాడిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం శ్రీతేజ్ క్రమంగా కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇంటి దగ్గరే అతనికి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే శ్రీతేజ్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం కూడా అండగా నిలవనుంది. మిషన్ వాత్సల్య పథకం ద్వారా బాధిత కుటుంబానికి మరింత భరోసా ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ మిషన్ వాత్సల్య పథకం కింద శ్రీతేజ సోదరికి ప్రతి నెల రూ.4,000 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. బాలికకు 18 సంవత్సరాలు నిండేంత వరకు నెలనెలా ఆర్థికసాయం అందుతుంది. మూడు నెలల క్రితం నుంచే ఈ పథకాన్ని ప్రారంభించగా, మొత్తం 12 వేల రూపాయిలు శ్రీతేజ్ తండ్రి భాస్కర్ ఖాతాలో జమ చేసినట్లు తెలుస్తోంది. ఇకపై కూడా నెలనెలా రూ.4 వేల ఆర్థిక సాయం తండ్రి ఖాతాలో జమ కానున్నాయి. ఇక శ్రీతేజ్ విషయానికి వస్తే.. ఈ పిల్లాడికి ఇంకా ట్రీట్ మెంట్ జరుగుతూనే ఉంది. ప్రస్తుతం అడ్వాన్స్ టెక్నాలజీ సాయంతో శ్రీతేజ్ కు ఫిజియోథెరఫీ ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. గతంతో పోలిస్తే పిల్లాడి పరిస్థితి మెరుగు పడినా, పూర్తిగా కోలుకునేందుకు చాలా రోజులు పడుతుందని డాక్టర్లు చెబుతున్నారు.అనాధలు, వివిధ కారణాలతో ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నా పిల్లలకు అండగా నిలవడమే ఈ పథకం ముఖ్యు ఉద్దేశం. కరోనా కాలంలో కేంద్రం ప్రభుత్వం రాష్ట్రాల సహకారంతో 2021లో ఈ పథకాన్ని ప్రారంభించింది. కేంద్రం 60, ఆయా రాష్ట్రాలు 40 శాతం నిధులు అందిస్తాయి. ఈ పథకంలో భాగంగా ఎంపిక చేసిన చిన్నారులకు నెలకు రూ.4,000 చొప్పున 18 ఏళ్ళు వచ్చేవరకు ఆర్థిక సాయం అందిస్తారు. ఇప్పుడు శ్రీతేజ్ కు కూడా ఇదే పథకంవర్తించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పండగ వేళ హాట్‌ టాపిక్‌గా బ్రహ్మీ..

తెలుగు బిగ్ బాస్‌లోకి దండుపాళ్యం హీరోయిన్

సరస్సులో 18 కోట్ల ఏళ్ల నాటి డైనోసార్‌ శిలాజాలు

ఎస్.. భార్యంటే ఆ మాత్రం భయం ఉండాల్సిందే..!

తాతను ఏం మాయ చేసావే.. 81 ఏళ్ల వృద్ధుడికి వలపు వల! ఏం చేశారంటే