టికెట్ ధరలపై అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Updated on: Nov 06, 2025 | 6:34 PM

మల్టీప్లెక్స్‌లలో సినిమా టికెట్లు, ఆహార పదార్థాల ధరలు అధికంగా ఉండటంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. సామాన్యులకు వినోదం భారంగా మారకూడదని, టికెట్ ధరలను ₹200కి పరిమితం చేయాలని ప్రతిపాదించింది. దీనిపై విధానాలు రూపొందించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.

మల్టీప్లెక్స్‌లలో సినిమా టికెట్లు, ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరగడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సామాన్య సినీ ప్రేక్షకుల్లో ఉన్న ఆగ్రహాన్ని సుప్రీంకోర్టు గట్టిగా వినిపించింది. ఒక కుటుంబం సినిమాకి వెళ్తే ₹1500 నుంచి ₹2000 వరకు ఖర్చు చేయాల్సి వస్తుందని, ఇది సామాన్యులకు భారంగా మారిందని కోర్టు అభిప్రాయపడింది. థియేటర్లలో విక్రయించే ఆహార, పానీయాల ధరలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఒక్క వాటర్ బాటిల్‌కు ₹100, కాఫీకి ₹700 వసూలు చేస్తారా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సినిమా హాళ్లు ఖాళీ అవ్వడం ఖాయమని హెచ్చరిస్తూ, టికెట్ ధరలను ₹200కి పరిమితం చేయాలని ప్రతిపాదించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

యూపీలో దారుణం.. రైల్వే ట్రాక్ దాటుతున్న యాత్రికులను ఢీకొన్న రైలు.. ఆరుగురు మృతి

Rain Alert: కొనసాగుతున్న ద్రోణి.. ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు

Gold Price Today: అయ్యో.. బంగారం మళ్లీ పెరిగిందే

AA22: ఏఏ 22 అప్‌డేట్‌.. బన్నీ కన్ఫార్మ్ చేసినట్టేనా ??

Akshay Kumar: అక్షయ్ డెడికేషన్ గురించి చిన్ని ప్రకాష్ కామెంట్