AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీదేవి ఆస్తి కోసం చెన్నై హై కోర్టు మెట్లెక్కిన భర్త బోనీ క‌పూర్

శ్రీదేవి ఆస్తి కోసం చెన్నై హై కోర్టు మెట్లెక్కిన భర్త బోనీ క‌పూర్

Phani CH
|

Updated on: Aug 28, 2025 | 9:16 PM

Share

దివంగత నటి శ్రీదేవి తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో అగ్రనటిగా రాణించారు. ఆమె త‌న జీవితంలో ఎన్నో స్థిరాస్తులను కొనుగోలు చేశారు. ఆమె మరణానంతరం భర్త బోనీ కపూర్, కూతుళ్లు జాన్వీ, ఖుషీకు ఆ ఆస్తులపై అధికారం ఉంది. తాజాగా చెన్నైలోని ఓ స్థలం విషయంలో చట్టపరమైన వివాదం మొదలైంది.

1988లో చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్‌లో శ్రీదేవి ఓ స్థలాన్ని సంబంద ముదలియార్‌ అనే వ్యక్తి వద్ద కొనుగోలు చేశారు. అప్పట్లో ముదలైర్‌కు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉండగా, వారి సమ్మతితోనే ఈ ఆస్తి శ్రీదేవి పేరుకు మారింది. అందులో ఫార్మ్‌హౌజ్‌ కట్టారు శ్రీదేవి. తాజాగా, ముగ్గురు వ్యక్తులు తాము సంబందం ముదలియార్‌ రెండో భార్య పిల్లలం అంటూ ముందుకు వచ్చారు. ఆ స్థిరాస్తిపై హక్కు తమదని చెబుతూ ఆ ఆస్తిని ఆక్రమించేందుకు ప్రయత్నించారు. తీవ్రంగా స్పందించిన బోనీ కపూర్, ఏప్రిల్ నెలలో మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన జస్టిస్ ఆనంద్ వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పిటిషనర్‌ ప్రకారం, ముదలైర్ రెండో భార్యను 1975లో వివాహం చేసుకున్నారు. ముదలైర్ మొదటి భార్య మాత్రం 1999లోనే మృతిచెందారు. అంటే మొదటి భార్య బతికి ఉన్న‌ సమయంలో రెండో వివాహం జరగడం వలన, హిందూ వారసత్వ చట్టం ప్రకారం, రెండో భార్య పిల్లలు చట్టబద్ధ వారసులుగా గుర్తింపు పొందలేరని కోర్టు స్పష్టం చేసింది. ఈ ముగ్గురు వ్యక్తులు తాంబరం తాలూకా తహశీల్దార్ వద్ద నుంచి వారసత్వ ధ్రువీకరణ పత్రాన్ని పొందారు. కానీ అది మోసపూరితంగా పొందిన పత్రం అని బోనీ కపూర్ ఆరోపించారు. దీనిపై విచారణ జరిపి, నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని తాంబరం త‌హ‌సీల్దారుని ఆదేశించింది హైకోర్టు. ఈ ఆస్తి వివాదం ప్రస్తుతం తుది దశలో ఉంది. తహశీల్దార్ సమర్పించే నివేదిక ఆధారంగా యాక్షన్‌ తీసుకోనున్నారు. బోనీ కపూర్ వాదనకు బలం ఉండటంతో, రెండో భార్య పిల్లలకు హక్కులుండవని న్యాయనిపుణులు భావిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మనోడు మామూలోడు కాదుగా.. ఏకంగా పెళ్లే చేసుకోనన్న హీరోయిన్‌నే పడేశాడు?

శ్రీతేజ కుటుంబానికి అండగా.. తెలంగాణ సర్కార్‌

పండగ వేళ హాట్‌ టాపిక్‌గా బ్రహ్మీ..

తెలుగు బిగ్ బాస్‌లోకి దండుపాళ్యం హీరోయిన్

సరస్సులో 18 కోట్ల ఏళ్ల నాటి డైనోసార్‌ శిలాజాలు