Sai Pallavi: మళ్లీ సౌత్ మీద దృష్టి పెట్టిన రౌడీ బేబి

Updated on: Nov 21, 2025 | 6:34 PM

కొంతకాలం సైలెంట్‌గా ఉన్న సాయి పల్లవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. బాలీవుడ్‌లో రామాయణం, జునైద్ చిత్రాలతో పాటు దక్షిణాదిలో నాగ్ అశ్విన్, ధనుష్‌తో సినిమాలు చేస్తున్నారు. అమరన్, తండెల్ విజయాల తర్వాత ఆమె పారితోషికం కూడా పెరిగింది. రికార్డులను బద్దలు కొడుతూ సాయి పల్లవి మళ్ళీ సౌత్‌పై దృష్టి సారించారు.

ఒక దశలో సడన్‌గా సినిమాల నుండి సైలెంట్ అయిన సాయి పల్లవి ఇప్పుడు సూపర్ ఫామ్ లో ఉన్నారు. డబల్ జోష్‌తో వరుస సినిమాలు చేస్తూ దక్షిణాది, ఉత్తరాది సినీ పరిశ్రమల్లో తన సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా కొద్ది రోజులుగా సౌత్‌లో సినిమాలు సైన్ చేయని ఈ నటి, ఇప్పుడు వరుస ప్రాజెక్టులను లైన్‌లో పెట్టారు. తండెల్ విజయం తర్వాత పూర్తి జోష్‌తో ఉన్న సాయి పల్లవి, బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. పౌరాణిక చిత్రం రామాయణంలో సీత పాత్రను పోషిస్తుండగా, ఆమిర్ తనయుడు జునైద్ హీరోగా తెరకెక్కుతున్న మరో చిత్రంలోనూ ఆమె నటిస్తున్నారు. ఈ రెండు బాలీవుడ్ చిత్రాలతో సాయి పల్లవి పేరు అక్కడి సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rasha Thadani: బాలీవుడ్ నయా సెన్సేషన్ రాషా తడాని

నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చిన రిషబ్ శెట్టి.. అంతకు మించి అనేలా ఉండబోతుందా ??

ఏపీ నుంచి ఆఫ్రికా వరకు విస్తరించిన ఐబొమ్మ రవి నెట్ వర్క్

Raju Weds Rambai: క్లైమాక్స్‌ కనెక్ట్ అయితే ఈ సినిమా మీకు నచ్చినట్టే

TOP 9 ET News: ట్రోల్స్ కాదు..దిమ్మతిరిగేలా వ్యూస్‌ !! పెద్ది సూపర్ రికార్డ్