Rashmika Mandanna: దేవరకొండతో పెళ్లయిన వేళావిశేషం… అరుదైన ఘనతతో హిస్టరీకెక్కిన రష్మిక
రష్మిక మండన్న అరుదైన ఘనత సాధించారు. జపాన్లో జరిగే ప్రతిష్టాత్మక 'క్రంచీరోల్ యానిమే అవార్డుల' వేడుకలో వరుసగా రెండోసారి ప్రెజెంటర్గా వ్యవహరించే అవకాశం దక్కించుకున్నారు. 2024లో మెరిసిన రష్మిక, రెండుసార్లు ఈ గౌరవం పొందిన తొలి భారతీయ సినీ సెలబ్రిటీగా చరిత్రకెక్కారు. మే 23న టోక్యోలో 10వ ఎడిషన్ వేడుకలో హాలీవుడ్ ప్రముఖులతో కలిసి అవార్డులు అందజేయనున్నారు. ఆమె అభిమానులకు ఇది గర్వకారణం.
దేవరకొండతో పెళ్లైన వేళావిశేషమో ఏమో.. రష్మిక మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. జపాన్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘క్రంచీరోల్ యానిమే అవార్డుల’ వేడుకలో వరుసగా రెండోసారి ప్రెజెంటర్గా వ్యవహరించే అరుదైన అవకాశం దక్కించుకున్నారు. గతంలో 2024లో ఈ వేదికపై మెరిసిన రష్మిక, రెండుసార్లు ఈ గౌరవం పొందిన తొలి భారతీయ సినీ సెలబ్రిటీగా రికార్డు క్రియేట్ చూస్తూ హిస్టరీ కెక్కారు. యానిమేటెడ్ చిత్రాలు, వెబ్సిరీస్లలో ప్రతిభ కనబరిచిన వారికి క్రంచీరోల్ యానిమే అవార్డులు ఇస్తుంటారు. తాజాగా 10వ ఎడిషన్ వేడుక మే 23న టోక్యోలో ఘనంగా జరగనుంది. ఈ వేడుకలో.. హాలీవుడ్ ప్రముఖులతో కలిసి విజేతలకు అవార్డులు అందజేయడానికి రష్మిక కూడా ఎంపికయ్యారు. గతంలో 2024లో కూడా రష్మ క ఈ అవార్డ్స్ వేడుకలో భాగం అయ్యారు. అప్పుడు కూడా విజేతలకు అవార్డ్స్ ఇచ్చే స్టార్గా అక్కడికి వెళ్లారు. ఇప్పుడు మరో సారి ఈ వేడుకలకు ఈమె వెళ్లబోతున్నారు. దీంతో ఈ న్యూస్ కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ఫ్యాన్స్ను గొప్పగా చెప్పుకునేలా చేస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Anna Lezhneva: ఇటు మోడ్రన్ గా.. అటు సంప్రదాయంగా.. సోషల్ మీడియాలో వైరల్గా.. పవన్ వైఫ్
బాహుబలిలో నా వల్ల అనుష్కకి గాయం.. సీక్రెట్ బయటపెట్టిన అడివి శేష్
Shanmukh Jaswanth: ఏంటి.. పెళ్లి అయిపోయిందా ?? ఫోటోలతో అభిమానుల్లో చర్చ
డే1 కలెక్షన్స్లో బైకర్ను దాటిన రాకాస !!
Bhanupriya: నా అక్క భాను ప్రియా పిచ్చిది కాదు.. స్పందించిన శాంతిప్రియ
