Animal: యానిమల్ పార్క్ అప్‌డేట్ ఇచ్చిన రణబీర్ కపూర్

Updated on: Jan 28, 2026 | 1:10 PM

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ నటించిన యానిమల్ చిత్రానికి సీక్వెల్ యానిమల్ పార్క్ త్వరలో రాబోతోంది. రణబీర్ కపూర్ దీనిపై అప్‌డేట్ ఇస్తూ, ప్రస్తుతం తాను ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని తెలిపారు. యానిమల్ సిరీస్ మూడు భాగాలుగా రూపొందనుందని, కథ సిద్ధంగా ఉందని కూడా వెల్లడించారు. పార్ట్ 2 తర్వాత త్రీక్వెల్ పై స్పష్టత వస్తుందన్నారు.

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించిన యానిమల్ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. తాజాగా, హీరో రణబీర్ కపూర్ యానిమల్ పార్క్ కు సంబంధించిన అప్‌డేట్‌తో పాటు మరో కీలక హింట్ ఇచ్చారు. ప్రస్తుతం రణబీర్ కపూర్ రామాయణ రెండు భాగాలతో పాటు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న లవ్ అండ్ వార్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా స్పిరిట్ వర్క్ లో నిమగ్నమై ఉన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయిన వెంటనే యానిమల్ పార్క్ పనులు ప్రారంభం కానున్నాయి. సీక్వెల్ తొలి భాగాన్ని మించి బలమైన పాత్రలు, ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో ఆడియన్స్ ను థ్రిల్ చేస్తుందని మేకర్స్ పేర్కొంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రీజినల్‌ సినిమాలకే నేషనల్ రీచ్‌.. మారుతున్న బాక్స్ ఆఫీస్ ట్రెండ్స్

Sonal Chauhan: సడన్‌గా సోషల్ మీడియాలో సందడి చేస్తున్న సోనాల్.. జోరు మామూలుగా లేదుగా

రజనీ – కమల్‌ మల్టీస్టారర్‌ ఏమైంది.. తెలుసుకోండి

Jr NTR: హైప్‌ పెంచుతున్న తారక్ టీమ్‌.. ఈ సారి మోత మోగిపోవడం పక్కా

హిట్టు కొట్టు.. కార్ పట్టు..! దర్శకులకు లగ్జరీ కార్ల బహుమతులు ఇవే

Loading...
Unable to load recommendations.
Follow Us