Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Priyanka Chopra: ముంబైలో ఆమె ఆస్తుల అమ్మకం .. ఎన్ని కోట్లు వచ్చాయంటే..

Priyanka Chopra: ముంబైలో ఆమె ఆస్తుల అమ్మకం .. ఎన్ని కోట్లు వచ్చాయంటే..

Phani CH

|

Updated on: Mar 13, 2025 | 3:42 PM

నటి ప్రియాంక చోప్రా ప్రస్తుతం మహేశ్‌బాబు- రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న #SSMB29లో ప్రతినాయకి పాత్ర పోషిస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె గత కొద్ది రోజులుగా ఇండియాలో ఉంటున్నారు. ఈ తరుణంలో ముంబయిలోని తన అల్ట్రా లగ్జరీ ఫ్లాట్‌లను కొన్ని ఆమె అమ్మినట్లు ఇండెక్స్‌ ట్యాప్‌ తెలిపింది. అంథేరిలో ఉన్న ఒబెరాయ్‌ స్కై గార్డెన్స్‌లోని ఫ్లాట్‌లకు డిమాండ్‌ బాగా ఉంది.

అంతేకాదు, అవి అత్యంత ఖరీదైనవి కూడా. అక్కడ ప్రియాంకకు అత్యంత విలాసవంతమైన జోడీ యూనిట్‌ సహా నాలుగు ఫ్లాట్‌లు ఉన్నాయి. ప్రస్తుతం వాటిని 16.17 కోట్ల రూపాయలకు విక్రయించారు. 18వ అంతస్తులో మూడు ఫ్లాట్స్‌ ఉండగా, వాటిని రూ.3.45 కోట్లు, రూ.2.85 కోట్లు, రూ.3.52 కోట్లకు అమ్మేశారు. ఇక 19వ అంతస్తులో ఉన్న జోడీ యూనిట్‌ ఒక్కదాన్నే రూ.6.35కోట్లకు అమ్మేశారట. మార్చి 3వ తేదీన ఇందుకు సంబంధించిన లావాదేవీలు పూర్తయ్యాయని తెలుస్తోంది. ఆర్కిటెక్చరల్‌ డైజెస్ట్‌ ఇండియా కథనం ప్రకారం 2021లో వెర్సోవాలోని రెండు ఆస్తులను, 2023లో లోఖండ్‌వాలాలోని రెండు పెంట్‌ హౌస్‌లను కూడా ప్రియాంక ఇప్పటికే విక్రయించారు. ప్రస్తుతం ఆమెకు గోవా, న్యూయార్క్‌, లాస్‌ ఏంజెలెస్‌లో సొంత భవనాలు ఉన్నాయి. హాలీవుడ్‌ చిత్రాలు, వెబ్‌సిరీస్‌లతో బిజీగా ఉన్న ప్రియాంకా చోప్రా.. భర్త నిక్‌ జోనస్‌, కుమార్తె మేరీ చోప్రా జోన్స్‌ తో కలిసి లాస్‌ ఏంజెలెస్‌లో ఉంటున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కంపెనీ వెబ్‌సైట్‌లో ఆత్మ హత్య లేఖ.. తన చావుకు భార్యే కారణం

SSMB29 సినిమా షూటింగ్ పై ఒడిశా డిప్యూటీ సీఎం ట్వీట్

Vijay Thalapathy: ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే! దెబ్బకు మైండ్ బ్లాక్ కదూ

శంకర్‌కు బిగ్ రిలీఫ్! ఆయన 11 కోట్ల ఆస్తుల జప్తుకు బ్రేక్

TOP 9 ET News: హనుమంతుడి గాథే… SSMB 29 ?? | రామ్‌ చరణ్‌తో బాలీవుడ్ ప్రొడ్యూసర్..ధమాకా దార్ ప్లాన్