కొడుకుపై నెగిటివ్ ట్రోలింగ్..పృథ్వీరాజ్ తల్లి ఎమోషనల్ కామెంట్స్ వీడియో
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఎదుగుదలను కొందరు ఓర్చుకోలేకపోతున్నారని, అతన్ని కించపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల విడుదలైన విలాయత్ బుద్ధా సినిమాను పుష్పతో పోలుస్తూ ట్రోలింగ్ జరిగిందని, ఇది ఆమె ఆందోళనకు కారణమని విమర్శకులు అంటున్నారు.
ఫ్యాన్ వార్స్ సాధారణమే అయినప్పటికీ, కొన్ని ఆరోపణలు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తల్లి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. తన కొడుకు ఎదుగుదలను కొందరు ఓర్చుకోలేకపోతున్నారని, అతన్ని కిందకి లాగడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె బహిరంగంగా మాట్లాడారు. ఎల్2 ఎంపురాన్ వంటి చిత్రంతో దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా అగ్రస్థానంలో ఉన్న పృథ్వీరాజ్కు కూడా ఇలాంటివి జరుగుతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం :
