బిగ్‌ బాస్‌లోకి పహల్గామ్ ఉగ్రదాడి బాధితురాలు

Updated on: Aug 13, 2025 | 6:22 PM

ఈ నెల 24 నుంచి హిందీలో బిగ్‌బాస్ 19వ సీజన్ మొదలుకానుంది. ఈసారి బిగ్ బాస్ హౌస్‌లో పాల్గొనే కంటెస్టెంట్స్ పేర్లు ఇంకా ప్రకటించకపోయినా.. కొందరి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఆ జాబితాలో.. పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్ పేరూ ఉందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

ఉగ్రదాడిలో భర్తను కోల్పోయిన ఆమె.. ఇంతలోనే బిగ్ బాస్ హౌస్‌లోకి రావటమేంటని కొందరు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే.. ఇది ఫేక్ న్యూస్ అని మరికొందరు కొట్టిపారేస్తున్నారు. సాధారణంగా.. బిగ్‌బాస్ షో నిర్వాహకులు.. ఆడియెన్స్ ను బాగా ఎంటర్ టైన్ చేసే కంటెస్టెంట్స్‌ను, సోషల్ మీడియాలో పాపులర్ అయిన వారిని తమ హౌస్‌లోకి తీసుకొస్తుంటారు. బిగ్ బాస్ ఓటీటీ 2 విజేత ఎల్విష్ యాదవ్‌కు హిమాన్షి ఒకప్పటి కాలేజీ మేట్ కావటంతో యాదవ్ సాయంతో.. హిమాన్షిని బిగ్ బాస్ షోకి ఒప్పించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో నిజం లేదని కొంత మంది కొట్టిపారేస్తున్నారు. ఇక భర్తతో కలిసి హనీమూన్‌ కోసం పహల్గాం వెళ్లిన సందర్బంలో ఉగ్రవాదులు.. ఆమె భర్తను ఆమె కళ్లముందే కాల్చి చంపిన ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఘటనా స్థలంలో భర్త మృత దేహం పక్కన హిమాన్షీ కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే చూసిన వారంతా కన్నీరు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మహేష్ సినిమాలో.. రావు బహదూర్‌గా సత్యదేవ్‌

NTR కాదు.. విలన్‌గా వార్‌2లో సర్‌ప్రైజ్ స్టార్

ప్రభాస్ చెల్లి చేసిన పనికి.. నిరాశలో రెబల్ స్టార్ ఫ్యాన్స్‌

మోహన్ బాబు పప్పు.. చరణ్ రసం! వావ్‌! వాటే కాంబినేషన్ గురూ

అర్హ క్యూట్ వీడియో.. అన్నయ్య‌ల‌కు రాఖీ కట్టి.. కాళ్లకు మొక్కిన బన్నీ త‌న‌య‌