ఎవరికి సాధ్యం కానిది.. మాలీవుడ్‌కు మాత్రమే ఎలా సాధ్యం ??

Updated on: Jan 07, 2026 | 3:03 PM

టాలీవుడ్‌తో పోలిస్తే మలయాళ చిత్ర పరిశ్రమ వేగం చూపిస్తోంది. మమ్ముట్టి, మోహన్‌లాల్ ప్రధాన పాత్రల్లో 16 ఏళ్ల తర్వాత రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ పేట్రియాట్ కేవలం 150 రోజుల్లోనే పూర్తయింది. ఈ చిత్రం ద్వారా మాలీవుడ్ పాన్-ఇండియా మార్కెట్‌పై దృష్టి సారించి, ఇతర పరిశ్రమలకు కొత్త సవాల్ విసురుతోంది.

టాలీవుడ్‌లో స్టార్ హీరోల సినిమాలు సాధారణంగా ఏడాది పాటు సెట్స్‌పై ఉంటాయి. అయితే, మలయాళ చిత్ర పరిశ్రమ మాత్రం ఈ విషయంలో తన వేగాన్ని ప్రదర్శిస్తోంది. ఒకరు కాదు, ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్న సినిమాను కూడా రికార్డు సమయంలో పూర్తి చేసి, మిగతా ఇండస్ట్రీలకు కొత్త ఛాలెంజ్ విసురుతోంది. మాలివుడ్ తెరపై క్రేజీ మల్టీస్టారర్ పేట్రియాట్ విడుదలకు సిద్ధమవుతోంది. సీనియర్ స్టార్స్ మమ్ముట్టి, మోహన్‌లాల్ కాంబినేషన్‌లో ఈ భారీ చిత్రం తెరకెక్కుతోంది. గతంలో వీరు 50కి పైగా సినిమాల్లో కలిసి నటించినా, 2008లో విడుదలైన ట్వంటీ 20 తర్వాత వీరి కాంబో పునరావృతం కాలేదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న బ్యూటీస్

Dhurandhar: ఏ మాత్రం తగ్గని ధురంధర్ హవా.. ఒక్కో రికార్డులు తిరగరాస్తుందిగా

Deepika Padukone: కొత్త టాలెంట్ కోసం దీపికా ప్లానింగ్..

మూడో ప్రపంచ యుద్ధం ?? మదురోకు అండగా కిమ్.. అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్

వైద్యులు చేసిన పనికి నిండు ప్రాణం.. ఏం జరిగిందంటే