గద్దర్ అవార్డ్స్కు డుమ్మా కొట్టిన స్టార్స్కు దిల్ రాజు స్వీట్ వార్నింగ్
ప్రజా యుద్ధనౌక గద్దర్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం సినీ అవార్డుల ప్రదానోత్సవాన్ని హైదరాబాద్ హైటెక్స్లో జూన్ 14న గ్రాండ్గా నిర్వహించింది. సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్టుగా అటెండ్ అయిన ఈ వేడుకల్లో అవార్డులకు ఎంపికైన నటీనటులతో పాటు టాలీవుడ్కి చెందిన అనేకమంది సెలబ్రిటీలు విచ్చేశారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, రాష్ట్ర ప్రభుత్వం కలిసి నిర్వహించిన ఈ వేడుకల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన సినిమాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు పురస్కారాలు అందజేశారు.
ప్రశంసా పత్రంతో పాటు క్యాష్ ప్రైజ్ ను కూడా అందించారు. అయితే దాదాపు 14 ఏళ్ల తర్వాత తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ఈ అవార్డ్ వేడుకకు కొంత మంది సెలబ్రిటీలు డుమ్మా కొట్టారు. ఈ క్రమంలోనే దిల్ రాజు అలా డుమ్మా కొట్టిన స్టార్ హీరోలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అందరికీ చెబుతున్నా.. గుర్తు పెట్టుకోండి… అవార్డులు వచ్చినవాళ్లు స్వయంగా ఫంక్షన్కు వచ్చి స్వీకరించాలని దిల్ రాజు అన్నారు. ఏ స్టేట్ అయినా, షూటింగ్స్లో ఎంత బిజీగా ఉన్నా రావాల్సిందేనన్నారు ఆయన. ప్రభుత్వంతో కలిసి నడవాల్సిన బాధ్యత సినీ ఇండస్ట్రీలో ఉన్నవాళ్లందరిపై ఉందని, ఈ విషయాన్ని అందరు అర్థం చేసుకోవాలన్నారు FDC చైర్మన్ దిల్ రాజు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘ఉంటే పద్దతిగా ఉండు.. లేదా అల్ట్రా మోడ్రన్గా ఉండు’ అనుష్క డ్రెస్సింగ్పై ఆమె తల్లి కామెంట్స్
లక్కీ బాయ్! చక్కని పిల్లని చూసుకున్నాడుగా ?? క్లారిటీ
భర్త కాళ్లు కడిగి.. ఆ నీటిని తాగిన హీరోయిన్ షాక్ లో ఈ బ్యూటీ ఫ్యాన్స్
కత్తితో కమల్ హాసన్ ముందుకు ఫ్యాన్ కోపంతో ఊగిపోయిన స్టార్ హీరో