‘రాజాసాబ్‌’ పై కుట్రలు? డైరెక్టర్ స్ట్రాంగ్ మెసేజ్‌ వీడియో

Updated on: Jan 04, 2026 | 4:55 PM

ప్రభాస్‌ నటించిన తొలి హారర్‌ కామెడీ సినిమా 'ది రాజాసాబ్‌'. సంక్రాంతి కానుకగా.. జనవరి 9న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే వరుసగా ఇంటర్వ్యూలిస్తూ.. తన సినిమాను ప్రమోట్ చేసుకుంటున్న మారుతీ.. ఓ ఇంటర్వ్యూలో క్రేజీ కామెంట్స్ చేశాడు. ఇండస్ట్రీలో కొంతమంది రాజాసాబ్‌ సినిమా ఫ్లాప్‌ అవ్వాలని కోరుకుంటున్నట్టు హోస్ట్ మారుతీకి చెప్పడంతో... జెలసీతోనే కొందరు అలా కోరుకుంటున్నట్టు ఆయన చెప్పాడు.

వారికి తన రాజాసాబ్‌ సినిమాతోనే గట్టి సమాధానం చెబుతానంటూ చెప్పుకొచ్చాడు.ఎట్ ప్రజెంట్ పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న రెబల్ స్టార్ ప్రభాస్‌ రాజాసాబ్‌ సినిమా కోసం 100 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్‌గా తీసుకున్నట్టు ఇన్‌సైడ్ టాక్. ఇక డైరెక్టర్ మారుతీ 18 కోట్ల రూపాయలను తీసుకోగా.. ఈ సినిమాలో యాక్ట్ చేసిన బాలీవుడ్ స్టార్ సంజయ్‌ దత్.. 6 కోట్ల రూపాయలను ఛార్జ్‌ చేసినట్టుగా న్యూస్. దీంతో ఇప్పుడు మరోసారి ప్రభాస్‌ రెమ్యునరేషన్ మ్యాటర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

మరిన్ని వీడియోల కోసం :

ఎన్టీఆర్‌పై చేతబడి..క్లారిటీ.. ఇదే వీడియో

ఆ సినిమా వల్లే నా కెరీర్ నాశనమైంది వీడియో

బెదిరింపులు,తిట్ల దండకాలు.. సోషల్ మీడియాలో ఆ ఇద్దరి హంగామా వీడియో

న్యూ ఇయర్ వేళ.. నటి పావలా శ్యామలను పరామర్శించిన సజ్జనార్ వీడియో