Dhanush: నయనతారపై కేసు పెట్టిన ధనుష్

Updated on: Nov 28, 2024 | 12:55 PM

ధనుష్, నయనతార మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఓ ప్రముఖ ఓటిటిలో వచ్చిన నయన్ డాక్యుమెంటరీతో మొదలైన వివాదం కాస్తా మరింత ముందుకు వెళ్తోందిప్పుడు. హీరోయిన్‌ నయనతార, ఆమె భర్త విఘ్నేష్‌ శివన్‌‌పై మద్రాస్‌ హైకోర్టులో సివిల్‌ కేసు దాఖలు చేశారు ధనుష్. తన అనుమతి లేకుండా నెట్‌ఫ్లిక్స్‌ డాక్యుమెంటరీలో 'నానుమ్‌ రౌడీ ధాన్‌' సినిమాకు సంబంధించిన విజువల్స్‌ వాడుకున్నారని పేర్కొన్నారు.

‘వండర్‌ బార్ ఫిల్మ్స్‌’ బ్యానర్‌పై ధనుష్‌ ‘నానుమ్‌ రౌడీ ధాన్‌’ సినిమాను నిర్మించారు. ఈ విషయంపైనే ధనుష్, నయనతార మధ్య వివాదం మొదలైంది. నోటీసులు పంపిన తర్వాత ధనుష్‌‌పై బహిరంగ విమర్శలు చేసారు నయన్. దాంతో వివాదం ఇంకాస్త పెద్దదైంది. తన అనుమతి లేకుండా విజువల్స్ వాడుకున్నందుకు రూ.10 కోట్లకు లీగల్‌ నోటీసులు పంపారు ధనుష్. నయన్ దంపతులపై ధనుష్ వేసిన పిటీషన్‌ను పరీశీలించిన ధర్మాసనం విచారణకు అంగీకరించింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రిలీజ్‌ అయిన 20 రోజుల్లోనే OTTకి వచ్చిన నిఖిల్ కొత్త సినిమా

Top 9 ET News: పుష్ప2కు రూ.300 కోట్ల రెమ్యూనరేషన్ మనోడే టాప్‌

Priyanka Jain: తిరుమలలో ప్రియాంక ప్రాంక్ వీడియో !! హెచ్చరించిన భక్తులు

Subbaraju: 47ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న సుబ్బరాజ్‌

చైతూ, శోభిత పెళ్లి డిజిటల్ రైట్స్ పై ప్రచారం క్లారిటీ ఇచ్చిన నాగ్ టీం

Loading...
Unable to load recommendations.
Follow Us