వయనాడ్ బాధితులకు అండగా ఖైదీ.. జైలు నుంచి 15 కోట్ల సాయం

Updated on: Aug 11, 2024 | 12:15 PM

కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగినపడిన ఘటనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 300లకు పైగా మృతి చెందగా.. వందలమంది గల్లంతయ్యారు. కొన్ని రోజులుగా ఆర్మీ, కేరళ ప్రభుత్వం సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా.. బాధితులను ఆదుకునేందుకు సినీ తారలు ముందుకు వచ్చారు. మలయాళం, తమిళం, తెలుగు ఇండస్ట్రీలకు చెందిన పలువురు సినీ స్టార్స్ భారీ మొత్తంలో విరాళాలు అందచేశారు.

కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగినపడిన ఘటనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 300లకు పైగా మృతి చెందగా.. వందలమంది గల్లంతయ్యారు. కొన్ని రోజులుగా ఆర్మీ, కేరళ ప్రభుత్వం సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా.. బాధితులను ఆదుకునేందుకు సినీ తారలు ముందుకు వచ్చారు. మలయాళం, తమిళం, తెలుగు ఇండస్ట్రీలకు చెందిన పలువురు సినీ స్టార్స్ భారీ మొత్తంలో విరాళాలు అందచేశారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ప్రియుడు సుఖేష్ చంద్రశేఖర్ కూడా వయనాడ్‌కు భారీగా విరాళం అందచేసేందుకు ముందుకు వచ్చాడు. ప్రస్తుతం సుకేష్ జైలులో ఉన్నారు. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో కొన్ని నెలల క్రితం జైలుకు వెళ్లిన సుకేష్.. జైలు నుంచే వయనాడ్ బాధితులకు అండగా నిలిచారు. వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన బాధితుల సహాయార్థం సుకేష్ ఫౌండేషన్ నుంచి 15 కోట్లు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందుతాయని ఆయన తరపు లాయర్ అనంత్ మాలిక్ మీడియాకు తెలిపారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నన్ను దుబాయ్‌లో అమ్మేస్తాడని భయమేసింది..

నాని ఆగయా.. ఇక షో అదిరిపోతుంది అంతే..!

పెనెం మీద నుంచి పొయ్యిలో పడటం అంటే ఇదే.. మరీ దారుణం.. ఈ స్టార్ హీరో పరిస్థితి

‘చై- శోభిత ఎంగేజ్మెంట్ – సామ్‌ రియాక్షన్’ వాళ్లు తప్పుదోవ పట్టిస్తున్నారు !!

TOP 9 ET News: సమయం ఆసన్నమైనది మిత్రమా ?? ఇక హంగామానే

Loading...
Unable to load recommendations.
Follow Us