AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మారుతున్న ఆడియన్స్ మైండ్ సెట్.. ఆ సినిమాలకు పెను సవాల్

మారుతున్న ఆడియన్స్ మైండ్ సెట్.. ఆ సినిమాలకు పెను సవాల్

Phani CH
|

Updated on: Mar 06, 2026 | 5:19 PM

Share

ఆడియన్స్ మైండ్ సెట్ మారిందని, కేవలం సంక్రాంతి సీజన్‌లోనే థియేటర్లకు వస్తున్నారని పరిశీలనలు చెబుతున్నాయి. ఫిబ్రవరిలో విడుదలైన కపుల్ ఫ్రెండ్లీ, హే బలవంత్, విష్ణు విన్యాసం వంటి చిన్న చిత్రాలకు మంచి టాక్ వచ్చినా వసూళ్లు కరువయ్యాయి. టికెట్ ధరల తగ్గింపు వ్యూహాలు కూడా పనిచేయడం లేదు.

ఈ మధ్య తెలుగు ప్రేక్షకులు బాగా సెలెక్టివ్‌గా మారారని పరిశీలకులు అంటున్నారు. నిర్మాతలు సంక్రాంతి సీజన్‌లో సినిమాలు విడుదల చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లే, ప్రేక్షకులు కూడా ఆ సీజన్‌లోనే థియేటర్లకు వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. దీనికి నిదర్శనంగా ఫిబ్రవరి నెలలో ఒక్క హిట్ కూడా నమోదు కాలేదు. విడుదలైన కొన్ని చిత్రాలకు మంచి టాక్ వచ్చినా, వసూళ్లు రాబట్టలేకపోయాయి. సంతోష్ శోభన్ హీరోగా నటించిన కపుల్ ఫ్రెండ్లీ సినిమాకు వాలెంటైన్ డే వీకెండ్ ఉన్నా కూడా, టాక్‌కు తగిన కలెక్షన్స్ రాలేదు. ఓపెనింగ్స్ పర్వాలేదనిపించినా, లాంగ్ రన్‌లో నిలబడలేకపోయింది. ఫిబ్రవరి 20న విడుదలైన సుహాస్ హే బలవంత్, ఫిబ్రవరి 28న వచ్చిన విష్ణు విన్యాసం చిత్రాల పరిస్థితి కూడా ఇదే.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Dhurandhar 2: ధురంధర్ 2 ఆ రోజున వస్తుందా.. రాదా ??

Toxic: అరె.. టాక్సిక్ సినిమా వాయిదా పడటానికి కారణం అదా..

మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం.. అప్పుల బాధ తట్టుకోలేక

AP Assembly: రాబోయే రోజుల్లో కరెంట్ ఛార్జీలు మరింతగా తగ్గిస్తాం

CM Chandrababu: ప్రపంచం మెచ్చేలా అమరావతిని నిర్మిస్తాం

Follow Us