AP Assembly: రాబోయే రోజుల్లో కరెంట్ ఛార్జీలు మరింతగా తగ్గిస్తాం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ అసెంబ్లీలో మాట్లాడుతూ, గతంలో పెంచిన కరెంట్ ఛార్జీలను తగ్గించినట్లు ప్రకటించారు. ట్రూ-డౌన్ చార్జీల ద్వారా యూనిట్కు 13 పైసలు తగ్గించి ₹4,498 కోట్ల భారాన్ని తొలగించామన్నారు. భవిష్యత్తులో సూర్య ఘర్ పథకం కింద సోలార్ ప్యానెళ్ల విస్తరణ, కరెంట్ భారం తగ్గించేందుకు మరిన్ని చర్యలు చేపడతామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలపై విద్యుత్ భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గతంలో పెంచిన కరెంట్ ఛార్జీలను తగ్గించినట్లు ఆయన ప్రకటించారు. ట్రూ అప్ చార్జీల భారాన్ని తొలగించి, ట్రూ డౌన్ చార్జీల కింద ఒక్కొక్క యూనిట్కు 13 పైసలు తగ్గించడం ద్వారా ₹4,498 కోట్ల కరెంట్ భారాన్ని తొలగించిన ఘనత తమ ఎన్.డి.ఎ ప్రభుత్వానిదని సీఎం పేర్కొన్నారు. భవిష్యత్తు ప్రణాళికలను వివరిస్తూ, సూర్య ఘర్ పథకం కింద ఇప్పటికే ఒక లక్ష ఇళ్లకు సోలార్ ప్యానెల్స్ అమర్చామని తెలిపారు. ఏప్రిల్, మే నెలల నాటికి ఆరు లక్షల ఇళ్లకు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
CM Chandrababu: ప్రపంచం మెచ్చేలా అమరావతిని నిర్మిస్తాం
వాట్సాప్ చాట్ ఆధారంగా విడాకులా ?? ఒరే.. మాంచి కథ కదురా ఇది
Chat GPT: ట్రెండింగ్లో ‘బాయ్కాట్ చాట్జీపీటీ’.. 25 లక్షల యూజర్లు చూపు ఆ AI వైపే
జంబలకిడిపంబ హోలీ చూసారా.. !! వాళ్ళు వీళ్లు అవుతారు.. వీళ్లు వాళ్ళు అవుతారు
Iran Strikes Back at Israel: ఇజ్రాయెల్ పై విరుచుకుపడుతున్న ఇరాన్
వాట్సాప్ చాట్ ఆధారంగా విడాకులా ?? ఒరే.. మాంచి కథ కదురా ఇది
ట్రెండింగ్లో 'బాయ్కాట్ చాట్జీపీటీ'..
జంబలకిడిపంబ హోలీ చూసారా.. !!
ఏపీలో ఆందోళన కలిగిస్తున్న టీనేజ్ ప్రెగ్నెన్సీ
తెలంగాణలో మరణాలకు అడ్డాగా మారిన జాతీయ రహదారి
ఒక్కసారిగా జిమ్ లో కుప్పకూలిన టెకీ.. ఆసుపత్రికి తీసుకెళ్లగా ?
లంచం అడిగిన తహశీల్దార్.. కోపం తో తిరగబడ్డ రైతులు

