Vijay-Rashmika: వారి పెళ్లిలో పంది మాంసంతో చేసే పాండీ కర్రీనే ఎందుకు ప్రత్యేకం ??

Updated on: Feb 25, 2026 | 8:51 PM

పాండీ కర్రీ, కర్ణాటకలోని కొడగు ప్రాంతానికి చెందిన ప్రసిద్ధ సంప్రదాయ పంది మాంసం వంటకం. ఇది కారంగా, పుల్లగా, ముదురు రంగులో ఉంటుంది. కచంపూలి అనే ప్రత్యేక నల్లటి వెనిగర్ దీనికి విశిష్ట రుచినిస్తుంది. వేయించిన సుగంధ ద్రవ్యాలతో చేసే ఈ కూరను బియ్యం పిండితో చేసిన కదంబుట్టు లేదా రోట్టెలతో తింటారు. కూర్గ్ సందర్శించే పర్యాటకులు తప్పకుండా రుచి చూడాల్సిన వంటకమిది.

పాండీ కర్రీ అనేది కర్ణాటకలోని కూర్గ్ అదే.. కొడగు ప్రాంతానికి చెందిన అత్యంత ప్రసిద్ధమైన మరియు సంప్రదాయబద్ధమైన పంది మాంసం వంటకం.పూర్వం కొడవ ప్రజలు అడవి పందులను వేటాడి ఈ వంటకాన్ని చేసేవారు. ప్రస్తుతం పెంపుడు పంది మాంసంతో దీన్ని తయారు చేస్తున్నారు. అయితే వీళ్లు ప్రత్యేకంగా చేసే ఈ వంటంకం… చాలా స్పైసీగా.. పుల్లగా ఉంటుంది. వేయించిన మసాలాల వల్ల ఈ కూర గాఢమైన నలుపు లేదా ముదురు గోధుమ రంగులో కనిపిస్తుంది.అంతేకాదు ఈ వంటకానికి ప్రత్యేకమైన రుచిని ఇచ్చేది కచంపులి అనే నల్లటి వెనిగర్. ఇది కొడగు ప్రాంతంలో పెరిగే ఒక ప్రత్యేక పండు నుంచి తయారు చేస్తారు. ఇందులో నల్ల మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు మరియు ఇతర సుగంధ ద్రవ్యాలను.. దోరగా వేయించి పొడి చేసి వాడుతారు. దీనిని సాధారణంగా బియ్యం పిండితో చేసిన రోట్టెలు లేదా బియ్యం పిండితో చేసిన ఉండలు వీటిని అక్కడి వారు కదంబుట్టు అంటారు. ఈ రెండింటి తో కలిపి తింటారు. అండ్ అంతేకాదు కూర్గ్ వెళ్ళిన పర్యాటకులు తప్పనిసరిగా రుచి చూడాల్సిన వంటకాల్లో ఇది ఒకటినే కామెంట్ ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నటి విష్ణుప్రియ తండ్రి దారుణ హత్య

Vijay-Rashmika Wedding: ఒక్కో గెస్ట్‌కు రూ.లక్ష.. అవాక్కవ్వకండి.. ఇంకా చాలా…

Samantha: సమంత ధీటైన జవాబు: సోషల్ మీడియాలో ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్

Sai Pallavi: బాలీవుడ్‌లో బిజీగా ఉన్న సాయి పల్లవి.. ఇక టాలీవుడ్ కు దూరమేనా

స్లో గా సైడ్ అవుతున్న స్టార్ హీరోలు. కళ తప్పుతున్న కోలీవుడ్

Published on: Feb 25, 2026 08:40 PM
Follow Us