రూ.5 లక్షల్లో బాహుబలి రేంజ్ సినిమా.. RGV ఏం చెప్పాలనుకుంటున్నారు ??
రామ్ గోపాల్ వర్మ ఏఐ టెక్నాలజీతో సినిమా భవిష్యత్తును మార్చవచ్చని అంటున్నారు. కోట్లతో తీసే బాహుబలి లాంటి చిత్రాలను కేవలం రూ.5 లక్షల బడ్జెట్తో నిర్మించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. భారీ సెట్స్, సిబ్బంది అవసరం లేకుండా డిజిటల్గా విజువల్స్ క్రియేట్ చేయొచ్చని వర్మ సూచించారు. అయితే, ఏఐ వాడకం సృజనాత్మకతను దెబ్బతీస్తుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
సినిమా నిర్మాణం కోట్ల బడ్జెట్, భారీ సెట్స్, వందల మంది సిబ్బందితో ముడిపడి ఉన్న ప్రస్తుత తరుణంలో, భవిష్యత్తులో ఈ లెక్కలు మారబోతున్నాయా అనే చర్చకు రామ్ గోపాల్ వర్మ తెరలేపారు. ఏఐ టెక్నాలజీ సినిమా భవిష్యత్తును సమూలంగా మార్చేస్తుందని, భారీ సినిమాలను కూడా తక్కువ బడ్జెట్తో తీసే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. వర్మ మాటల ప్రకారం, ఏఐ సహాయంతో భారీ విజువల్స్, యాక్షన్ సీక్వెన్సులు, కల్పిత ప్రపంచాలను డిజిటల్గా సృష్టించవచ్చు. దీనివల్ల పెద్ద సెట్స్, భారీ సిబ్బంది, కోట్ల ఖర్చు అవసరం లేకుండా పోతుందని, బ్లూ స్క్రీన్స్లో అద్భుతాలు సృష్టించే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ పరిణామంతో బాహుబలి లాంటి సినిమాలు కూడా కేవలం రూ.5 లక్షల్లో సిద్ధం చేయవచ్చని వర్మ అభిప్రాయపడ్డారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వింటేజ్ లుక్ ని ట్రై చేస్తున్న నార్త్ బ్యూటీస్
Maharaja 2: మహారాజా సీక్వెల్.. సేతుపతి సిగ్నల్ ఇచ్చేసినట్టేనా
Madhubala Biopic: సిల్వర్ స్క్రీన్ మీద మధుబాల బయోపిక్