నటి డింపుల్ హయాతిపై PS లో ఫిర్యాదు చేసిన పనిమనుషులు

Updated on: Oct 02, 2025 | 3:29 PM

నటి డింపుల్ హయతి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆమె ఇంటి పని మనుషులు వేధింపులు, డబ్బులు ఇవ్వలేదని ఫిర్యాదు చేశారు. ఫిల్మ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేయగా, డింపుల్ హయతి భర్తపైనా కేసు నమోదైంది. గతంలో కూడా వివాదాల్లో ఉన్న హయతి, ఇప్పుడు పని మనుషుల ఫిర్యాదుతో వార్తల్లో నిలిచారు.

నటి డింపుల్ హయతి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సినిమాల కంటే ఎక్కువగా వివాదాలు, గ్లామర్ షూట్‌లతో వార్తల్లో ఉండే డింపుల్, ఇప్పుడు తన ఇంటి పని మనుషులను వేధించారన్న ఆరోపణలతో హాట్ టాపిక్‌గా మారారు. హయతిపై ఆమె పని మనుషులు ఫిల్మ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పనికి పిలిచి తమను వేధిస్తున్నారని, ఇంట్లో పని చేయించుకుని డబ్బులు కూడా ఇవ్వలేదని వారు ఆరోపిస్తున్నారు. తమను చిత్రహింసలు పెట్టారని కూడా వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు డింపుల్ హయతితో పాటుగా ఆమె భర్తపైన కూడా కేసు నమోదు చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన.. వికీపీడియాకు పోటీగా మరో ప్లాట్‌ఫాం

చీరకట్టులో పురుషుల గర్బా డ్యాన్స్‌.. ఎందుకంటే ??

దసరా రోజు పాలపిట్టను చూడాలి.. ఎందుకంటే ??

భారీ భూకంపం.. 69 మంది మృతి

అమెరికా షట్‌డౌన్‌.. అప్పుడూ ట్రంప్ హయాంలోనే

Published on: Oct 02, 2025 03:28 PM