ఎక్సైజ్ సీఐ ఉద్యోగం అంటే ఐదెంకల జీతం…. లక్షల్లో మామూళ్లు జీవితం ప్రశాంతంగా ఉంటుందనుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగం అనగానే కేవలం ఆ బాధ్యతలు నిర్వర్తించిన మిగిలిన సమయం కుటుంబం కోసమో లేదంటే ఇంకో పనిలో నిమగ్నమవుతారు. కానీ నాగర్ కర్నూల్ జిల్లా ఎక్సైజ్ సీఐ ఏడుకొండలు మాత్రం కాస్త డిఫరెంట్. ఉద్యోగం సంపాదించే క్రమంలో తాను పడ్డ కష్టాలు ఇతరులు పడొద్దని సామాజిక బాధ్యతను భుజాన వేసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటిపడే పేద విద్యార్థులకు అండగా నిలిచారు సిఐ ఏడుకొండలు. వారికోసం ‘ది మిషన్’ అనే సంస్థను స్థాపించి నిరుద్యోగార్థుల పట్ల ఉద్యోగసోపానంగా మారారు. త ఆరున్నర సంవత్సరాలుగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో విధులు నిర్వహిస్తూ.. ఖాళీ సమయంలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ ఇస్తున్నారు ఏడుకొండలు. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మంది నిరుద్యోగులకు ఉచితంగా కోచింగ్ ఇస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ రోజున అక్షరాలు దిద్దిస్తే.. అద్భుతాలు జరుగుతాయా ??
Medaram Jatara 2024: కోటి మంది వచ్చే జాతర.. కన్నుల పండువగా మొదలైంది
Ratha Saptami: ఫిబ్రవరి 16న రథసప్తమి.. ఆ రోజు ఏమి చేయాలంటే ??
2025 నాటికి భారత్ రానున్న ఫ్లయింగ్ కార్స్ !! ఇంటిపైనే ల్యాండింగ్
PM Surya Ghar Yojana 2024: కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్తు.. కేంద్రం కొత్త పథకం ప్రారంభం