Tata ACE Pro: డిజిటల్ ఫైనాన్స్‌తో దేశ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌కు కొత్త ఊపు.. చిన్న వ్యాపారాలకు టాటా ఏస్ ప్రో సాధికారత

Updated on: Aug 21, 2025 | 12:31 PM

దేశ ఆర్థిక వ్యవస్థలో డిజిటల్ ఫైనాన్స్, సమ్మిళిత రుణ పథకాలు విప్లవాత్మక మార్పులు తెస్తున్నాయి. గిగ్ కార్మికులు, చిన్న వ్యాపారులు, మహిళా వ్యవస్థాపకులు ఇప్పుడు సులభంగా రుణాలు పొంది, తమ వ్యాపారాలను వృద్ధి చేసుకుంటున్నారు. ఆర్థికవేత్త డాక్టర్ జైజిత్ భట్టాచారి ప్రకారం.. టాటా ఏస్ ప్రో వంటి వాణిజ్య వాహనాలు ఈ మార్పుకు ముఖ్యమైన సాధనంగా మారాయి.

డిజిటల్ ఫైనాన్స్ సమ్మిళిత రుణ పథకాలు దేశ ఎంట్రప్రెన్యూర్ సెక్టార్‌ను పూర్తిగా మార్చివేస్తున్నాయి. ఇప్పుడు డిజిటల్, ఆర్థిక విధానాలు కొత్త వ్యవస్థాపకులకు అవకాశాలను సృష్టిస్తున్నాయి. గిగ్ కార్మికులు, చిన్న వ్యాపారులు కూడా ఇప్పుడు తమ ఆర్థిక బాధ్యతను పెంచుకొని సులభంగా రుణాలు పొందుతున్నారు. ఆధార్-లింక్డ్ బ్యాంకింగ్, యూపీఐ, జీఎస్టీ, డిజిటల్ చెల్లింపుల వంటి ఆధునిక ఆర్థిక మార్గాలు ఈ పరివర్తనకు దోహదపడుతున్నాయి. ఇదివరకు రుణాలకు దూరంగా ఉన్న చిన్న వ్యాపార యజమానులు సైతం ఇప్పుడు సులభంగా ఆర్థిక సహాయం పొందుతున్నారు. ఆర్థికవేత్త డాక్టర్ జయజీత్ భట్టాచారి ప్రకారం.. ఎమ్ఎస్ఎమ్ఈ రుణ పథకాలు ఇప్పుడు వాణిజ్య వాహనాలను కేవలం రవాణా సాధనాలుగా కాకుండా ఒక ముఖ్యమైన వ్యాపార పెట్టుబడిగా గుర్తిస్తున్నాయి. ఈ మార్పుల ఫలితంగా టాటా ఏస్ ప్రో వంటి వాహనాలు ఎంట్రప్రెన్యూర్‌షిప్‌కు ఒక ప్రవేశ ద్వారంగా మారాయి.

మహిళా వ్యవస్థాపకులకు సాధికారత

మహిళల నేతృత్వంలోని స్వయం సహాయక బృందాలుకూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాయి. వారు టాటా ఏస్‌ను ఉపయోగించుకొని స్థానిక సరఫరా గొలుసులను బలోపేతం చేస్తున్నారు. తద్వారా తమ కమ్యూనిటీలలో ఉపాధి, ఆర్థిక స్వాతంత్య్రాన్ని సృష్టిస్తున్నారు. డాక్టర్ భట్టాచారి ఈ పరివర్తనను హైలైట్ చేస్తూ.. ఆర్థిక వనరులు సులభంగా అందుబాటులోకి వచ్చినప్పుడు అది ఒక అవకాశాన్ని సృష్టిస్తుంది. అంతేకాకుండా, ఒక వాహనం కేవలం ప్రయాణ సాధనం మాత్రమే కాకుండా అది యాజమాన్యం, గౌరవం, వృద్ధికి చిహ్నంగా మారుతుంది అని అర్థం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Aug 21, 2025 12:25 PM