గుంటూరు జిల్లా వెంకటాయపాలెంలో కోలాహలం నెలకొంది. ఇళ్ల పట్టాల పంపిణీ సభకు భారీగా తరలివచ్చారు జనం. దాంతో, అక్కడ పండగ వాతావరణం కనిపిస్తోంది. మరికాసేపట్లో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ చేయనున్నారు సీఎం జగన్. రెండు జిల్లాలు, ఆరు గ్రామాలు, 1402 ఎకరాలు, 25 లేఅవుట్స్, 50వేల 793 ఇళ్ల స్థలాలు… ఇదీ సింపుల్ R5 జోన్లో నిర్మాణం కాబోతున్న జగనన్న టౌన్షిప్ కంప్లీట్ పిక్చర్. ఇక్కడ కాలనీల నిర్మాణానికి 2వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతోంది ప్రభుత్వం.